మదినిండా తల్లుల నామస్మరణ
శరణు శరణు తల్లులారా.. కరుణించండి.. మీ చెంతకు చేరాం.. మీ దర్శనమే మహాభాగ్యం.. అంటూ వనజాతరకు వచ్చిన భక్తులు అమ్మలను తలచారు.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించారు.
ఒడిబియ్యంతో మహిళ
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, తాడ్వాయి, మంగపేట, న్యూస్టుడే: శరణు శరణు తల్లులారా.. కరుణించండి.. మీ చెంతకు చేరాం.. మీ దర్శనమే మహాభాగ్యం.. అంటూ వనజాతరకు వచ్చిన భక్తులు అమ్మలను తలచారు.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించారు. వనమంతా భక్తజనం నిండిపోవడంతో మేడారం మురిసింది. సమ్మక్క, సారలమ్మ చిన్న జాతరకు గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు తరలొచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
పాదాలు తాకేందుకు పొర్లుదండాలు
నీ పాద స్పర్శతో పునీతులమవుతాం అంటూ పొర్లు దండాలు పెడుతూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. సమ్మక్క తల్లి పూజాసామగ్రిని నెత్తిన ఎత్తుకుని గుడికి వెళ్తున్న క్రమంలో పూజారుల పాద స్పర్శ కోసం భక్తులు పోటీపడి పొర్లు దండాలు పెట్టారు. డోలు చప్పుళ్లు, కొమ్ము బూరల సంగీతం, జై సమ్మక్క తల్లీ అనే నినాదాలతో మేడారం మారుమోగింది. గ్రామ మహిళలు నిండు బిందెలతో నీళ్లను ఆరబోసి అమ్మవార్లకు మొక్కుకున్నారు. సారలమ్మ పూజారులు అమ్మవారి పూజాసామగ్రిని ఆలయానికి తీసుకెళ్లారు. డేరాలను ఆలయాల్లో భద్రపర్చారు. అనంతరం పూజారులు కుటుంబసభ్యులు, బంధువులతో కలసి పూజలు చేశారు.
గద్దెల నుంచి ఆలయాలకు అడేరాలు
మండమెలిగే పండగను ఆదివాసీ సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి పూజారులు అమ్మవార్ల పూజా సామగ్రి అడేరాలను గద్దెకు చేర్చగా.. విద్యుద్దీపాలను ఆర్పివేసి పూజారులు శాంతి, రహస్య పూజా కార్యక్రమాలను నిర్వహించి గద్దెల ప్రాంగణంలోనే జాగరణ చేశారు. గురువారం ఉదయం గద్దెల ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. డోలు వాయిధ్యాలతో గద్దెల నుంచి అమ్మవార్ల పూజా సామగ్రిని తీసుకెళ్లారు. ఈ వేడుక ఎంతో ఆడంబరంగా సాగింది. సమ్మక్క పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, ముణీందర్, లక్ష్మణ్రావు, కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ పూజారులు కాక సారయ్య, కిరణ్కుమార్, తదితర, పూజారులు పాల్గొన్నారు.
దర్శనానికి వెళ్తున్న యువతి
సమ్మక్క అడేరాలు తీసుకెళ్తుండగా పొర్లుదండాలు పెడుతున్న భక్తులు
జంపన్నవాగులో జలకాలాట
స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్