జౌళి పార్కుకు ‘మిత్ర’ లాభం!
‘ పీఎం మిత్ర’ (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఒక జౌళి పార్కును మంజూరు చేస్తున్నట్టు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.
పరిశ్రమల ఏర్పాటు ఇక వేగవంతం
ఈనాడు, వరంగల్
కాకతీయ మెగా జౌళి పార్కు
‘ పీఎం మిత్ర’ (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఒక జౌళి పార్కును మంజూరు చేస్తున్నట్టు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. వరంగల్ జిల్లాలోని కాకతీయ జౌళి పార్కు ఈ పథకం కింద ఎంపిక కానుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వరప్రదాయిని కాకతీయ మెగా జౌళి పార్కు పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. వరంగల్ జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఈ భారీ జౌళి పార్కు నిర్మాణమవుతోంది. పీఎం మిత్ర కింద ఎంపికైన ఈ పార్కుకు కేంద్రం నుంచి భారీగా నిధులు దక్కనున్నాయి. కేంద్రం ఇప్పటికే అందుబాటులో ఉన్న పార్కుకు రూ.200 కోట్లు బ్రౌన్ ఫీల్డ్ కింద ఇస్తామని చెప్పడం వల్ల జౌళి పార్కుకు ఈ మేరకు అదనంగా నిధులు రానున్నాయి.
పనుల్లో వేగం..
కాకతీయ మెగా జౌళి పార్కు శంకుస్థాపన 2017 అక్టోబరులో జరిగింది. ఏడాదిలోపు టెక్స్టైల్ పార్కును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. భారీ పరిశ్రమలకు వంద నుంచి 300 ఎకరాల వరకు భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. దీంతోపాటు ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా) పరిశ్రమల ఏర్పాటుకు 52 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీని కింద కూడా కేంద్రం నుంచి మరో రూ.7 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 కోట్లు జత చేస్తే మొత్తం రూ.10 కోట్లతో మెగా జౌళి పార్కులో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
* రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పలు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తోంది. రూ.100 కోట్లు వెచ్చించి రహదారుల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్తోపాటు, మిషన్ భగీరథ నీటి పైపులైన్ నిర్మాణం, విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు 1200 ఎకరాలు సేకరించడంతో దానికే భారీ స్థాయిలో నిధులు వెచ్చించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మెగా జౌళి పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తే పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
వీటిపై దృష్టి పెట్టాలి
ఓరుగల్లు నగరానికి ఇప్పటికే కేంద్రం నుంచి స్మార్ట్సిటీ, అమృత్, హృదయ్ పథకాలు దక్కాయి. వీటికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఇప్పుడు మెగా జౌళిపార్కు కూడా కొంత మేర కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుగా గుర్తింపు పొందనుంది. మెగా జౌళి పార్కు పూర్తి స్థాయిలో సాకారమైతే వరంగల్ దుస్తుల విపణికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి జౌళి పార్కు వరకు సెంట్రల్ లైటింగ్తో నాలుగు వరసల రహదారి నిర్మాణం పూర్తి చేయాలి. సంగెం మండలం చింతలపల్లి వద్ద రైల్వేపై వంతెనను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేయాలి. వరంగల్లోని మామునూరు విమానాశ్రయం కూడా సాకారమైతే దేశ, విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది..
వేగంగా నిర్మాణ పనులు
ఇప్పటికే గణేశా ఎకో పెట్కు చెందిన రెండు పరిశ్రమలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నుంచి దారం లాంటి పదార్థం తీసే వినూత్న పరిశ్రమ ఇది. కేరళకు చెందిన కైటెక్స్ పరిశ్రమ నిర్మాణం వేగంగా జరుగుతోంది. త్వరలో ‘యంగ్ వన్ కార్పొరేషన్’ అనే దక్షిణ కొరియా పరిశ్రమ ప్రతినిధులు తమ యూనిట్ను నెలకొల్పేందుకు జౌళి పార్కుకు రానున్నారు.
గతేడాది ప్రారంభమైన గణేశా ఎకో పెట్ పరిశ్రమ
వస్త్ర హబ్గా ఓరుగల్లు
ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో నాణ్యమైన పత్తి పండుతుంది. ఈ క్రమంలోనే ఇక్కడ చేనేతలు అధిక సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు అజాంజాహి మిల్లు నడిచింది కూడా ఇక్కడ సులువుగా పత్తి లభ్యమవుతుందని. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి వరంగల్ ప్రాంతం జౌళి హబ్గా మారుతోంది. వరంగల్ జిల్లాలో కాకతీయ జౌళి పార్కు రానుంది. హనుమకొండ జిల్లాలోని మడికొండలో ఇప్పటికే మినీ జౌళి పార్కు నడుస్తోంది. ఇందులో 365 వస్త్ర యూనిట్లు ఏర్పాటయ్యాయి. జనగామ జిల్లా కళ్లెంలో సైతం మరో వంద ఎకరాలను జౌళి పార్కు ఏర్పాటు కోసం అభివృద్ధి చేస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో సైతం మరో జౌళి పార్కు రావాల్సి ఉంది.
అంకెల్లో వివరాలు..
* భూసేకరణకు - రూ.114.33 కోట్ల ఖర్చు
* మొత్తం సేకరించిన భూమి - 1203 ఎకరాలు
* ఇప్పటి వరకు వెచ్చించిన నిధులు - రూ.100 కోట్లు
* కేంద్రం మిత్ర కింద ఇచ్చే నిధులు - రూ.200 కోట్లు
* ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారి సంఖ్య - 100,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
[ 26-07-2024]
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
[ 26-07-2024]
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
[ 26-07-2024]
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆకర్షక పద్దు
[ 26-07-2024]
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వారికి అన్ని విధాలుగా మేలు చేసేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులు చేశారు. అభివృద్ధే అజెండాగా.. సంక్షేమం దండిగా ఉండేలా ఆర్థిక పద్దు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
పంచాయతీల్లో కానరాని పౌర సేవల పట్టికలు
[ 26-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీల్లో ప్రజలకు పౌర సేవలు అరకొరగానే అందుతున్నాయి. పంచాయతీలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో సూచిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా పౌరసేవల పట్టికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
విశ్వ క్రీడల కీర్తి.. ఓరుగల్లు పొందాలి స్ఫూర్తి
[ 26-07-2024]
ఒలింపిక్స్లో పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. అసాధ్యమూ అంతకన్నా కాదు. కావాల్సిందల్లా గట్టి సంకల్పం, పట్టుదల, కృషి. ఉమ్మడి వరంగల్లో క్రీడాకారుల ప్రతిభకు కొదువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి సానబెడితే ఒలింపిక్స్కు మనవాళ్లు అర్హత సాధించడం పెద్ద సమస్యే కాదు. -
ఆయన లేని లోకంలో ఉండలేనని..
[ 26-07-2024]
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. వివాహబంధంతో ఒకటయ్యారు.. కష్టసుఖాలు పంచుకున్నారు.. పిల్లలను ప్రయోజకులను చేశారు.. అరవై ఏళ్లు తోడు-నీడగా ఉన్నారు.. మలి సంధ్యలోనూ నీకు నేను...నాకు నువ్వు అనుకుంటూ జీవిస్తున్నారు.. ఇంతలో భర్త హఠాన్మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.. -
ఎక్సైజ్కాలనీ.. ఎక్కడ చూసినా సమస్యలే
[ 26-07-2024]
హనుకొండ నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అన్ని అనుమతులతో ఐదు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడింది. ఇప్పకీ కొన్ని వీధుల్లో డ్రైనేజీలు లేవు. రోడ్డు నెంబర్ 5సీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. -
సరిహద్దులో పేలిన తూటా!
[ 26-07-2024]
కొన్నాళ్లుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరు సాగుతోంది. గురువారం ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని గుండాల-తాడ్వాయి మండలాల పరిధిలోని దామెరతోగు, కరకగూడెం అటవీ ప్రాంతంలో తుపాకీ తూటాల మోతలు మోగాయి. -
ఠాణాల్లో భూ తగాదాలు.. సివిల్ పంచాయితీలు!
[ 26-07-2024]
జిల్లా పరిధిలోని కొన్ని పోలీసు సబ్ డివిజన్లలో సీఐలు, ఎస్సైల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఠాణాల్లో యథేచ్ఛగా భూ పంచాయితీలు, సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూరుస్తూ అమ్యామ్యాయాలు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మాదిరిగానే వ్యవహరించగా జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
[ 26-07-2024]
శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?