logo

దూర విద్య పీజీ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

కాకతీయ విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం నిర్వహిస్తున్న పీజీ పరీక్షల షెడ్యూల్‌ ఎట్టకేలకు ఖరారైంది.

Published : 30 Mar 2023 04:44 IST

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం నిర్వహిస్తున్న పీజీ పరీక్షల షెడ్యూల్‌ ఎట్టకేలకు ఖరారైంది. పరీక్షల నిర్వహణలో ఆలస్యంపై ‘ఈనాడు’లో ఈనెల 25న ‘పరీక్షల ఊసేలేదు’ అనే శిర్షీన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం సాయంత్రం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ గణితం, హెచ్‌ఆర్‌ఎం, ఎల్‌ఎల్‌ఎం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు వచ్చే నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి మల్లారెడ్డి, అదనపు అధికారి నరేందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని