నీటి గోస వినేదెవరు?
రోజూ తాగునీటి సరఫరా కలగానే మిగిలింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించినా అడుగులు పడటం లేదు. కార్యాలయాల్లో సమావేశాలు, సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
న్యూస్టుడే, కార్పొరేషన్: రోజూ తాగునీటి సరఫరా కలగానే మిగిలింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించినా అడుగులు పడటం లేదు. కార్యాలయాల్లో సమావేశాలు, సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాలకవర్గం పెద్దలు, అధికారులు కదలడం లేదు. ఎండా కాలం మొదలైంది. తాగునీటి అవసరాలు పెరిగాయి. సరిపడా తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత గ్రేటర్ వరంగల్దే. పాలకవర్గం, ఇంజినీర్లు పట్టింపు లేకుండా ఉన్నారని ప్రజలు వాపోతున్నారు. సోమవారం ప్రజావాణిలో నీటి సరఫరాపై 9 ఫిర్యాదులు వచ్చాయి. తాగునీళ్లు ఇవ్వండని అధికారులను వేడుకున్నారు. రెండు, మూడు వారాలుగా సరఫరా అస్తవ్యస్తంగా మారినా ఎవరికీ పట్టడం లేదు. మేయర్ సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో అంతా బాగుందని ఇంజినీర్లు చెబుతున్నారు. కాలనీల్లో చూస్తే పరిస్థితి మరోలా ఉంది. కలుషితమైన నీళ్లు వస్తున్నాయని, పాత నల్లాలు ఆకస్మాత్తుగా బంద్ చేయడం, మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రావడం లేదని ప్రజలు వివరించారు.
మానిటరింగ్ సెల్ పనిచేస్తుందా?
నగరంలోని 66 డివిజన్లలో తాగునీటి సరఫరా తీరును తెలుసుకునేందుకు మానిటరింగ్ సెల్ ప్రారంభించారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, చివరి ఇంటికి నీటి సరఫరా జరిగిందీ లేనిదీ అడిగి తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం నెరవేరడం లేదు. రోజూ ఎవరితో మాట్లాడుతున్నారు? సమస్యలేమిటనేది ఎవరికీ తెలియదు. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేయాల్సిన కొందరు డీఈ, ఏఈలు నీటి సరఫరాను పట్టించుకోవడం లేదు.
ఇవిగో ఉదాహరణలు
* హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో నీటి సరఫరా లేదు. కొత్తూరు జెండా, కుమార్పల్లి, రెడ్డికాలనీల్లో కలుషితమైన నీళ్లు వస్తున్నాయి.
* వరంగల్ వేణురావు కాలనీ, మండిబజారు, రామన్నపేట, పాపయ్యపేట, సంతోషిమాత కాలనీ, ఉర్సు, రంగశాయిపేట ప్రాంతాల్లో నల్లాల ద్వారా రంగు మారిన నీళ్లు వస్తున్నాయి.
* మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్లో పలు కాలనీలకు నీటి సరఫరా ఆగింది. రామన్నపేట పెద్దమోరీ పనుల కోసం పైపులు తవ్వి వదిలేశారు. శివనగర్ పల్లవి ఆసుపత్రి లైన్లో నీటి సరఫరా పునరుద్ధరించ లేదు.
* 40వ డివిజన్ ఉర్సు సుభాస్నగర్, బొడ్రాయి, కుమ్మరివాడ, ప్రతాప్నగర్ తదితర కాలనీల్లో పాత నల్లాల ద్వారా సరఫరా ఆపేశారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరావు అవుతున్న లీకేజీలతో కలుషితమైన నీరు వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
*41, 42వ డివిజన్ ఉర్సు పార్కు, రంగశాయిపేట, కాపువాడ, ఎస్సీ కాలనీ, శంభునిపేట ప్రాంతాల్లో నీటి సరఫరా క్రమం తప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం