logo

మన భవిష్యత్తు మన చేతుల్లోనే..

యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు.

Published : 30 Nov 2023 03:25 IST

యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. తమ ఇంటి ముందు బుధవారం రంగులతో ముగ్గులు వేసి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలని సందేశం ఇచ్చారు. తొలిసారిగా ఎన్నికల్లో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. ఓటుతోనే మన భవిష్యత్తు ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ నిజాయతీగా ఓటు వేయాలని కోరారు.

న్యూస్‌టుడే, వర్ధన్నపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని