రండి ఓటేద్దాం..
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది.
పోలింగ్ కేంద్రం పిలుస్తోంది
ఈనాడు, మహబూబాబాద్ : ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. ఈ రోజు సెలవు కదా.. అని ఇతర పనులు ఏమి పెట్టుకోకుండా ఓటేసి పొమ్మంటోంది ఊరు.
అడవి, ఎడారి బిడ్డలను స్ఫూర్తిగా తీసుకుందాం
మనకంటే ముందుగా పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లో, దూరంగా ఉన్న ఎడారి రాష్ట్రంగా పిలిచే రాజస్థాన్లో పోలింగ్ జరిగింది. అడవి బిడ్డలున్న ఛత్తీస్గఢ్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని దాటుకుని మన్యం బిడ్డలు ఓటేశారు. రాజస్థాన్లోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. 75.45 శాతం మంది ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఆ రెండు చోట్ల కంటే మన దగ్గర పరిస్థితులు భిన్నం.. అన్ని వసతులన్నాయి.. కూత వేటు దూరంలోనే పోలింగ్ కేంద్రాలుంటాయి. అయినా ఓటు వేసేందుకు వెనుకంజలో ఉంటున్నారు. ఈసారి పై రెండు రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకుని 2018లో నమోదైన 82.59 శాతానికి మించి నమోదయ్యేలా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుదాం.
ఛత్తీస్గఢ్ ఆదర్శం.. : ఛత్తీస్గఢ్ మన పొరుగు రాష్ట్రం.. మావోయిస్టుల బెదిరింపులు వచ్చినా.. పోలింగ్ కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఉన్నా.. సరైన రవాణా వ్యవస్థ లేకున్నా వాటన్నింటిని అధిగమించి మన్యం బిడ్డలు ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఆ రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు రెండు విడతల్లో నిర్వహించిన పోలింగ్లో 76.31 శాతం ఓటర్ల తమ హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
దేశం నలుమూలల నుంచి
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన చాలా మంది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి రీత్యా దేశం నలుమూలలా ఉంటున్నారు. వీరంతా సొంతూర్లకు బయలుదేరారు. విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు సైతం ప్రత్యేకంగా ఓటు వేయడానికి వచ్చారు. దూరప్రాంతాల వారే ఓటు వినియోగంపై మక్కువ చూపిస్తుంటే సమీపంలోని, ఇతర జిల్లాలు, రాజధానిలో ఉన్న వారు స్వస్థలాలకు వచ్చి ఓటేసి సత్తాచాటాలి.
యువత ఓటు బాటపట్టాలి
ఎన్నికల సంఘం అక్టోబరు 4న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 12 నియోజకవర్గాల్లో 18 నుంచి 39 ఏళ్ల వారు 14,00,257 మంది ఉన్నారు. దీనికి తోడు ఈ నెల 11న ప్రకటించిన అనుబంధ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 81,708 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరిలోనూ యువ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలా మంది విద్య, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వెళ్లిన వారుంటారు. వీరందరూ ఓటేసేందుకు సొంతూరికి వస్తే పోలింగ్ శాతం మరింత పెరుగుతుంది.
న్యూజెర్సీ నుంచి వచ్చా
- ఎం.బుచ్చిబాబు, అయోధ్య, మహబూబాబాద్
పదేళ్ల కిందట న్యూజెర్సీకి వెళ్లాను. అక్కడ ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజులకే సొంతూళ్లో ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. నాతో పాటు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పది మంది స్నేహితులం కలిసి వచ్చాం. ఓటు హక్కు అనేది మన భవిష్యత్తును నిర్ణయించేది. మంచి పనులు చేసే నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో అంత దూరం నుంచి వచ్చాను. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లందరూ పోలింగ్ రోజున ఎన్ని పనులున్నా తప్పకుండా తమ ప్రాంతానికి వచ్చి ఓటేసి పోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ