నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును.
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. మీతో ఓ మనవి చేసుకుందామని చలిలో మంచు కురిసేవేళ ఇలా వచ్చా. మిమ్ముల్ని వేడుకునేదేంటంటే.. దయచేసి నన్ను ఓడించకండి. నాపై గౌరవంతో నన్ను గెలిపించండి..
ఈనాడు, వరంగల్, డోర్నకల్, న్యూస్టుడే
మీ ‘మార్కు’ చూపండి
అప్పుడు యువత నన్ను గెలిపించినట్టు.
పట్టణాలు, నగరాల్లో నా విలువ గుర్తించడానికి తక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ కేవలం 58.29 శాతం. 2014లో 57.55 శాతమే. పోలింగ్ రోజు సెలవు ఉందని యువత ఆసక్తి చూపకపోవడం వల్ల ఓటింగ్ తగ్గుతోంది. చదువుల్లో పోటీపడి 90 శాతం పైగా మార్కులను తెచ్చుకుందామని చూస్తారు..అదే స్ఫూర్తి నన్ను సంధించడంలో కూడా చూపండి. అత్తెసరు శాతం పోలింగ్ కాకుండా ‘మీ మార్కు’ చూపి నగరాల్లో కూడా 80 నుంచి వందకు చేరేలా ఓటు వేయండి.
సెలవు అర్థం అది కాదు
సెలవు తీసుకొని ఓటేయకపోతే నేను ఓడిపోయినట్టు
పండగలకు ఇచ్చినట్టే నా ‘ఓటు పండక్కి’ కూడా ప్రభుత్వం సెలవు ఇవ్వడం సంతోషంగా ఉంది. కొందరి తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది. కార్యాలయాలకు సెలవు ఇచ్చారని సినిమాలు, పర్యటనలకు వెళ్తున్నారు. సెలవు ఇచ్చింది ఓటేయడం కోసమని మరవొద్దు. పోలింగ్కు ఒకరోజు ముందు హనుమకొండ బస్టాండ్ కిటకిటలాడింది. వారంతా ఓటేయడానికి తమ సొంతూళ్లకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలా మీరంతా కూడా ఈ రోజు మొదట ఓటేశాకే సినిమాలు, షికార్లు మరే పనైనా.
ఇదీ నా బలగం
నిజాయతీపరులు ఎన్నికైతే నేను గెలిచినట్టు.
ఉమ్మడి వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో నా బలగం చూస్తే చాలా ఆనందంగా ఉంది. పురుష ఓటర్లు 14,68,775 మంది కాగా, మహిళలు 15,05,252. ఇతరులు 467. మగవారి కన్నా మహిళా ఓటర్లు 36,477 మంది అధికంగా ఉన్నారు. మొత్తం 29,74, 494 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా నేడు నా కోసం సమయం వెచ్చించాలి. ఎవరో వారి స్వార్థం కోసం చెప్పిన వారికి కాకుండా, మీ ఊరి వారు, మీ సామాజిక వర్గం వారనో కాకుండా, సుపరిపాలన అందించే వారు, ప్రజా జీవితం గడిపేవారు. మంచి వ్యక్తిత్వంగల వారికి ఓటు వేయండి..
నడుచుకుంటూ ఇంటికొచ్చా
వారి స్ఫూర్తితో మిగతా వారు ఓటేస్తే నేను గెలిచినట్టు.
ఓటుగా నా లక్షణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఎక్కువ మందికి చేరువయ్యేందుకు ఎంతో శ్రమిస్తున్నా. ఈసారి కదల్లేని స్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి కోసం నేను వారి ఇళ్లకే వెళ్లి వారి చేతిలో వజ్రాయుధంగా మారా. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో మీ చెంతకొచ్చి మిమ్ముల్ని అక్కున చేర్చుకున్నా. మీ ఆదరాభిమానానికి మురిసిపోయా. 80 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు వారి శరీరాలు సహకరించకపోయినా ఓపిక చేసుకుని మరీ నన్ను సంధించారు. మరి మీ చేతులు, కాళ్లూ అన్నీ బాగున్నాయి. వయసు సహకరిస్తోంది. మరి ఆలస్యమెందుకు?
దయచేసి అవి వద్దు
‘వజ్రాయుధం లాంటి నన్ను తాయిలంగా వాడుకుంటే నేను ఓడినట్టు.
వరంగల్ ముద్దు బిడ్డ ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. ‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటి వాడోనని చూడు’ అన్నారు ఆయన. ఎన్నికల్లో నిలబడే వారి వ్యక్తిత్వం, ప్రజాసేవ తదితర అంశాలు పరిశీలించండి. డబ్బు ఇస్తున్నారో, మద్యం పోస్తున్నారనో, కానుకలు ముట్టజెబుతున్నారనో, మరేదైనా తాయిలం ఇచ్చే వారివైపు మొగ్గితే నన్ను మీరు తాకట్టు పెట్టినట్టే. ప్రజాస్వామ్య గుండెకాయనైన నన్ను ఎవరైనా డబ్బుకు అమ్ముతారా? ప్రలోభ పర్వానికి దూరంగా ఉండి స్వేచ్ఛగా నిజాయతీగా మీకు ఇష్టమైన అభ్యర్థి కోసం నన్ను ఉపయోగించుకుంటే ఎంతో సంతోషిస్తా.
మరి మీరంతా నన్ను గెలిపిస్తారుగా..
‘పార్టీ అభ్యర్థులను గెలిపించేది.. ఓడించేది నువ్వే.. మరి పోలింగ్ రోజు ఈ ప్రచారం ఏంటి?’ అని అనుకోకండి..పోలింగ్ కేంద్రానికి వెళ్లి నన్ను గెలిపించేందుకు పైన చెప్పినట్టు నన్ను సంధించండి. మీ వేలికున్న సిరా చుక్క చూసి నేను మురిసిపోతా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి