logo

కేసీఆర్‌ కలిసిన మాజీ మంత్రి

జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత సోమవారం గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన గృహంలో కలిశారు.

Published : 05 Dec 2023 03:23 IST

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత సోమవారం గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన గృహంలో కలిశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వారు మొదటిసారిగా కేసీఆర్‌ను కలిసి జిల్లా పరిస్థితిని వివరించారు.


భారాస శ్రేణులు అధైర్యపడొద్దు

మరిపెడ, న్యూస్‌టుడే: భారాస శ్రేణులు అధైర్యపడొద్దని జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అన్నారు. సోమవారం మరిపెడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో డోర్నకల్‌ భారాస అభ్యర్థి విజయం కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ గుడిపూడి నవీన్‌, ఎంపీపీ గుగులోతు అరుణ, జడ్పీటీసీ సభ్యురాలు శారద, పురపాలిక సంఘం అధ్యక్షురాలు సింధూరకుమారి, స్థానిక భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు  ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని