రుద్రమలై కదలాలి.. ఓరుగల్లు మురవాలి
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు చోటు లభించింది. ములుగు, వరంగల్ తూర్పు స్థానాల నుంచి విజయం సాధించిన దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సీతక్క, సురేఖలపై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, రంగంపేట, న్యూస్టుడే
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు చోటు లభించింది. ములుగు, వరంగల్ తూర్పు స్థానాల నుంచి విజయం సాధించిన దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఓరుగల్లు రుద్రమలై ఉమ్మడి వరంగల్ను ప్రగతి బాటలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.
తొలి సవాలు మేడారం జాతర
ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ సీతక్కకు తన సామర్థ్యం నిరూపించుకోవడానికి మేడారం జాతర రూపంలో మంచి అవకాశం వచ్చింది. తన సొంత నియోజకవర్గంలో జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క సారలమ్మ మహాజాతరను విజయవంతం చేయడం ద్వారా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. ఇప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. వెంటనే భారీగా నిధులు కేటాయించి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి.
పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి..
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి. బొగత, రామప్ప, లక్నవరం, వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, పాకాల సరస్సు, పాండవుల గుట్టలు ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటిలో సౌకర్యాలు కల్పించి ఓరుగల్లును పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దాలి.
దేవాదుల ఆశలన్నీ మీపైనే..
ఉమ్మడి వరంగల్తో పాటు, ఉమ్మడి నల్గొండ, మెదక్ జిల్లాలకు దాదాపు 6 లక్షల ఎకరాల సాగునీరే లక్ష్యంగా దేవాదుల ప్రాజెక్టును నిర్మించారు. మూడో దశలో నిర్మిస్తున్న సొరంగం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర కాల్వలు, పైప్లైన్ నిర్మాణాల్లో ఇప్పటికీ జాప్యం అవుతోంది. అంచనా వ్యయం రూ.5 వేల కోట్లతో మొదలై ఇప్పుడు రూ.17 వేల కోట్లకు పెరిగింది. నేటికీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. నిధులు కేటాయించి, పనులు వేగవంతం చేసి రైతులకు సాగినీటిని అందించాలి.
గ్రేటర్ సమస్యలు తీరాలి
వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రి పదవి దక్కడంతో వరంగల్ నగరాభివృద్ధిపై ఆశలు చిగురించాయి. 2009లోనూ వైఎస్ఆర్ హయాంలో మహిళా శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మంత్రులూ వీటిపై దృష్టి పెట్టరూ..
- యునెస్కో గుర్తింపు దక్కిన రామప్పను అభివృద్ధి చేయాలి. కేంద్రం ‘ప్రసాద్’ పథకంలో చేర్చినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేయాలి.
- వరంగల్ స్మార్ట్ సిటీ పనులు పూర్తిచేయాలి. ఎంజీఎంలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి.
- వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండల పరిధిలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ(టైక్స్టైల్ పార్కు)ను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 60 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కేంద్రం కూడా మిత్ర పథకంలో చేరుస్తామని ప్రకటించింది.
- భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తిచేయాలి.
- ములుగు జిల్లాలో ములుగు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పాటు. గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలి
- చేర్యాల రెవెన్యూ డివిజన్, జనగామ పట్టణంలో మౌలిక సదుపాయాలు, రంగప్ప చెరువు సుందరీకరణ, తాగునీటి సరఫరా చేయాలి. పీజీ కళాశాలకు సొంత భవనం నిర్మాణం చేయాలి.
- వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండలో డంపింగ్ యార్డు సమస్య, ఐనవోలు మండలంలో ల్యాండ్పూలింగ్ సమస్య పరిష్కరించాలి. మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి.
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో వంద పడకల ఆసుపత్రి అవసరం. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగా ఏర్పడిన దంతాలపల్లి, సీరోల్ మండలాలకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి.
మంత్రులుగా మనోళ్లు..!
నాటి ఆంధ్రప్రదేశ్.. నేటి తెలంగాణ ఎప్పుడైనా వరంగల్ జిల్లాది ప్రత్యేక స్థానం. ప్రతి ప్రభుత్వంలో కీలక శాఖలు ఇక్కడివారిని వరించాయి. ఉప ముఖ్యమంత్రి స్థాయి నుంచి వివిధశాఖల మంత్రులుగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి వరంగల్ నుంచి ఇప్పటి వరకు 23 మంది మంత్రి పదవుల్ని చేపట్టారు. ఈసారి కొత్తగా సీతక్క ఆ జాబితాలో చేరారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ శాఖ మంత్రిగా పనిచేశారనే వివరాలతో ప్రత్యేక కథనం..
ఈనాడు, మహబూబాబాద్
కడియం శ్రీహరి: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున 1994, 1999లో గెలిచారు. ఆ సమయంలో ఏర్పడిన తెదేపా ప్రభుత్వంలో మార్కెటింగ్ గిడ్డంగులు, సాంఘిక సంక్షేమ, విద్యా, భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై ఉపముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
దాస్యం ప్రణయ్భాస్కర్: హనుమకొండ నుంచి 1994లో తెదేపా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ ప్రభుత్వ మంత్రి మండలిలో యువజన, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
బొచ్చు సమ్మయ్య: పరకాల నుంచి కాంగ్రెస్ (ఐ) తరఫున ఎన్నికై 1978లో మర్రిచెన్నారెడ్డి, 1982లో కోట్ల విజయ భాస్కర్రెడ్డి మంత్రివర్గంలో పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రిగా వ్యవహరించారు.
తక్కళ్లపల్లి పురుషోత్తమరావు: 1989లో వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి ఆర్అండ్బీశాఖ మంత్రిగా పనిచేశారు.
పొన్నాల లక్ష్మయ్య: జనగామ నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రి వర్గంలో మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ హయాంలో భారీ, మధ్య తరహా నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 వరకు రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో దేవాదాయ, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
డీఎస్ రెడ్యానాయక్: డోర్నకల్ నియోజకవర్గం నుంచి గెలిచి 2004లో వైఎస్.రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు.
బస్వరాజు సారయ్య: 2009లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు.
టి.హయగ్రీవచారి: 1957, 1962లో ధర్మసాగర్ నియోజకవర్గం నుంచి, 1972లో స్టేషన్ఘన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి మండలిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, 1982లో సాంకేతిక విద్యాశాఖ, దేశీయ వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు.
అజ్మీర చందులాల్: 1985, 1994, 2014లో ములుగు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1989లో ఎన్నికలకు ఆరు నెలల ముందు తెదేపా ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో భారాస ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ, పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
పింగిలి ధర్మారెడ్డి: పరకాల నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ తరఫున గెలిచి జలగం వెంగళ్రావు మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.
సంగమరెడ్డి సత్యనారాయణ: హనుమకొండ నుంచి 1983లో తెదేపా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.
రామస్వామి: గోక రామస్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా 1978, 1983లో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1978 నుంచి 1979 వరకు మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా, టంగుటూరి అంజయ్య కేబినెట్లో 1980 నుంచి 1982 వరకు రవాణా, మత్స్య, ఉద్యానవన అభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.
మాదాడి నర్సింహారెడ్డి: 1985, 1989లో శాయంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచారు. 1989లో మున్సిపల్శాఖ మంత్రిగా పనిచేశారు.
పోరిక జగన్నాయక్: ములుగు ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా పోరిక జగన్నాయక్ 1978లో విజయం సాధించారు. 1983, 1989లో మరోసారి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా విజయం సాధించి ఉద్యాన, పశుసంవర్ధకశాక మంత్రిగా పనిచేశారు.
ఎన్. యతిరాజారావు: ఇప్పటి పాలకుర్తి నియోజకవర్గంలోని చెన్నూరు 2009 వరకు నియోజకవర్గంగా కొనసాగింది. చెన్నూరు నుంచి తెదేపా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994లో ఆర్అండ్బీ, దేవాదాయ, సహకారశాఖ మంత్రిగా పనిచేశారు.
పీవీ రంగారావు : 1989లో హనుమకొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1992లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
నూకల రాంచంద్రారెడ్డి: డోర్నకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున నాలుగు సార్లు విజయం సాధించారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1960లో ఆహార, వ్యవసాయం, కార్మికశాఖ మంత్రిగా, 1962లో, 1964-1967 వరకు రెవెన్యూ, భూ సంస్కరణల శాఖ మంత్రిగా, 1973-74 వరకు ఆర్థిక, వాణిజ్య పన్నులశాఖ మంత్రిగా పనిచేశారు.
తాటికొండ రాజయ్య: 2014లో స్టేషన్ ఘన్పూర్ నుంచి భారాస తరఫున గెలిచి కేసీఆర్ సర్కారులో ఉపముఖ్యమంత్రిగా, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.
గుండె విజయరామారావు: స్టేషన్ఘన్పూర్ నుంచి 2004లో భారాస శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్, భారాస పొత్తులో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి మండలిలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు.
నిమ్మ రాజిరెడ్డి: చేర్యాల నియోజకవర్గం నుంచి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985, 1989, 1994లో తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో విద్యుత్తుశాఖ మంత్రిగా పనిచేశారు.
ఎర్రబెల్లి దయాకర్రావు: 2018లో పాలకుర్తి నుంచి భారాస తరఫున విజయం సాధించి కేసీఆర్ మంత్రి వర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
సత్యవతిరాథోడ్: 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం కేసీఆర్ మంత్రి వర్గంలో గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!