అవినీతి అధికారులకు తప్పదు శిక్ష!
సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగుల ఆధారంగా ఏడాదిన్నరగా రూ.కోటిన్నర దోచుకున్న పోస్టుమాస్టర్ అవినీతి బాగోతానికి రెండేళ్ల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెరదించడం ఉమ్మడి జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దోచుకొన్న సొమ్ముకు రెండింతలు సమర్పించిన పోస్టు మాస్టరు
కొడకండ్ల, న్యూస్టుడే: సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగుల ఆధారంగా ఏడాదిన్నరగా రూ.కోటిన్నర దోచుకున్న పోస్టుమాస్టర్ అవినీతి బాగోతానికి రెండేళ్ల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెరదించడం ఉమ్మడి జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. హనుమకొండకు చెందిన కేసరి సతీష్ అనే పోస్టుమాస్టర్ అక్కడి ప్రధాన తపాలా కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ 2020 సెప్టెంబరులో కొడకండ్ల పోస్టుమాస్టరుగా బదిలీపై వచ్చారు. అప్పటికే ప్రధాన కార్యాలయం కంప్యూటర్లలో తపాలా శాఖ పద్దులన్నింటిపై అవగాహన ఏర్పర్చుకొని కొడకండ్ల కేంద్రంగా అవినీతికి తెరలేపారు. వరంగల్, భువనగిరి తపాలా కార్యాలయాల్లో మాత్రమే రైల్వే టికెట్ రిజర్వేషన్లు, ఉపసంహరణలు చేసుకొనే సదుపాయాన్ని కల్పించి సాఫ్ట్వేర్లో ప్రత్యేక పద్దులు కేటాయించడాన్ని గమనించిన సతీష్ ఆరు మాసాల కాలం ఆ పద్దుల నుంచి డబ్బులు తీసుకోవడం, తిరిగి జమచేస్తూ రెక్కీ నిర్వహించారు. లావాదేవీలు జరగని ఆదివారాల్లో మాత్రమే ఆ పద్దుల నుంచి డబ్బులు తీసుకొంటుండటంతో ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. సతీష్ తన బ్యాంకు ఖాతాతో పాటు స్నేహితులు, బంధువుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేవారు. క్రమంగా జల్సాలకు, జూదానికి పాల్పడుతూ వచ్చారు. ప్రజలకు చెల్లించే వివిధ రకాల పద్దుల సొమ్ము యథావిధిగా ఉండటంతో అధికారులు సైతం అనుమానించలేక పోయారు. ఏప్రిల్ 2022లో ఆయన వారం రోజులు సెలవు పెట్టడంతో కేంద్ర కార్యాలయానికి సంబంధించిన మరో ఉద్యోగిని పోస్టుమాస్టర్గా కొడకండ్లకు పంపడంతో లెక్కలు సరిచూస్తుండగా రూ.4.50 లక్షల తేడా కన్పించడంతో సతీష్ను ప్రశ్నించారు. డబ్బులు తనవద్దనే ఉన్నట్లు చెప్పి అనుకోకుండా రైల్వే పద్దులో నమోదు చేసినట్లు వివరించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. కేంద్ర కార్యాలయంలో పూర్తి వివరాలను గమనించగా కొడకండ్ల తపాలాశాఖ కార్యాలయం నుంచి ఆదివారాల్లో లక్షల రూపాయలు ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. 2023 మే 21న తపాలాశాఖ ఉన్నతాధికారులు, పలువురు సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేసి సతీష్ సమక్షంలోనే రాత్రి ఒంటిగంట వరకు విచారణ చేపట్టి చివరకు అవినీతికి పాల్పడ్డట్టు నిర్ధారించి తక్షణం విధుల నుంచి తొలగించారు. ఏడాదిన్నరగా అతనికి సహకరించిన సుమారు 20 మంది తపాలా అధికారులు, సిబ్బంది నుంచి సుమారు రూ.80 లక్షలు వసూలు చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం సతీష్ అందించిన వివరాలతో పూర్తి స్థాయి సాక్ష్యాలు సేకరించిన ఈడీ అతని ఆధీనంలో ఉన్న రూ.3.26 కోట్ల విలువ గల ఆస్తులను రెండు రోజుల క్రితం స్వాధీనం చేసుకొని భారీ అవినీతికి తెరదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.