మేడారం మెరవాలి.. భక్తులు మురవాలి
మేడారం మహాజాతర ముగిసింది. ఈసారి జాతర నిర్వహణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి.
మేడారం మహాజాతర ముగిసింది. ఈసారి జాతర నిర్వహణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతరకు తక్కువ సమయం ఉన్నా.. రూ.75 కోట్లు ఒకసారి, రూ.35 కోట్లు మరోసారి మంజూరు చేసి ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం, కొత్త అధికారులు విధుల్లో ఉండటం, నిర్వహణలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావడంతో.. భక్తులు అసంతృప్తికి లోనయ్యారు. మహా జాతరలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తామని, వచ్చే మినీ జాతర నాటికి ఇబ్బందులు తొలగిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ ప్రయత్నాన్ని ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లి అమలు చేస్తే వచ్చే జాతరను పకడ్బందీగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
సమావేశం కీలకం
జాతర తిరుగువారం అనంతరం ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పూజారులు, తదితర నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన లోపాలు, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చేపట్టాల్సిన విధివిధానాలేంటి? బడ్జెట్, తదితర అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. త్వరగా సమావేశం నిర్వహిస్తే జాప్యం కాకుండా అభివృద్ధికి అడుగులు పడేందుకు వీలుంటుంది.
మేడారం జాతరలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తే ఇలాంటి అవస్థలు తప్పుతాయి.
ప్రత్యేక అథారిటీ అవసరం
జాతర నిర్వహణ, శాశ్వత పనులు, మేడారం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఉండాలని మంత్రి సూచించారు. ఈ ప్రత్యేక అథారిటీ మేడారం జాతర అభివృద్ధికి కృషి చేస్తుంటుంది. ఇందులో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, పూజారులు, నిపుణులు ఉండే అవకాశం ఉంది. దీని ఏర్పాటుతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుని పనుల ప్రగతిపై సమీక్షిస్తారు. పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వ అనుమతితో దీనిని ఏర్పాటు చేస్తారు.
జాతరకు వస్తున్న వాహనాలివి. ప్రధాన రహదారులను నాలుగు వరుసలుగా విస్తరిస్తే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించవచ్చు.
మాస్టర్ ప్లాన్ తప్పనిసరి
జాతరలో ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే భక్తులకు సౌకర్యాలు మెరుగయ్యాయి. భక్తుల రద్దీతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ముందస్తుగా ఓ ప్రత్యేక సర్వే చేపట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. దీనిద్వారా మెరుగైన వసతులు కల్పించే అవకాశం ఉంటుంది.
శాశ్వత పనులపైనే దృష్టి
మరుగుదొడ్లు, తాగునీరు, క్యూలైన్లు, కాటేజీలు, విడిది కేంద్రాలు, షవర్లు, ఇతరాత్ర శాశ్వత పనులపైనే దృష్టి పెట్టాలి. సులువుగా దర్శనం చేసుకునే విధంగా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించాలి. అమ్మవార్ల గద్దెలకు కానుకలు చేరే విధంగా, గద్దెల నుంచి భక్తులకు ప్రసాదంగా బంగారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్ నియంత్రణ, ప్రధాన రహదారుల విస్తరణ, వచ్చిన దారినే వెళ్లేలా అన్ని మార్గాలను నాలుగు వరుసలుగా చేపట్టాలి.
2018 జాతరలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.200 కోట్లు ప్రకటించారు. అవి మంజూరు కాలేదు. ప్రతిపాదనలు సిద్ధం చేసినా ముందుకు కదల్లేదు. ఈసారైనా అడుగులు పడాలి. భవిష్యత్తులో ఈ మహా ఉత్సవం సాఫీగా జరగాలి.
‘ఏమైనా లోపాలుంటే వచ్చే చిన్న(మినీ) జాతర కల్లా సరిదిద్దుకుంటాం. త్వరలో అధికారులు, పూజారులతో సమీక్షించి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తాం. అందరి సూచనలు, సలహాలు స్వీకరించి ఈ ప్రాంత బిడ్డగా వచ్చే జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. క్యూలైన్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర శాశ్వత ఏర్పాట్లు చేస్తాం. జాతర సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధికి కృషి చేస్తాం’
జాతర ముగింపు రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు