బంధాలను తట్టిలేపే సంధ్య కథలు
సందేశాత్మక కథలకు పాఠకాదరణ ఎప్పుడూ తగ్గదని నిరూపిస్తున్నాయి సంధ్య అడుపు రచనలు.
మహిళా దినోత్సవం ప్రత్యేకం
దేశవిదేశాల్లోని తెలుగువారి ఆదరణ
సందేశాత్మక కథలకు పాఠకాదరణ ఎప్పుడూ తగ్గదని నిరూపిస్తున్నాయి సంధ్య అడుపు రచనలు. మానవ సంబంధాలను తట్టిలేపేలా భిన్న నేపథ్యాలతో రాస్తూ వాటిని అంతర్జాలంలో అందుబాటులో పెట్టడంతో లక్షలాది మంది పాఠకులు ఆన్లైన్లో చదివేస్తూ కథల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఈనాడు, వరంగల్
మంచుకొండల్లో రాస్తూ
సంధ్య స్వస్థలం హనుమకొండ బ్యాంకుకాలనీ. భర్త సునీల్ అడుపు లైబ్రేరియన్. ఉద్యోగారీత్యా వీరు ఆరేళ్ల కిందట ఉత్తరాఖండ్లోని నైనిటాల్కు వెళ్లి స్థిరపడ్డారు. హిమాలయపర్వతాల మధ్య ప్రకృతి ఒడిలో నివాసం ఉంటున్నారు. చక్కని వాతావరణం. ఎటు చూసినా మంచు కొండలే. ఈ ప్రకృతి అందాలను చూస్తూ సంధ్య కలం కదిలించడం మొదలుపెట్టారు. తన చిన్నతనంలో జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాలలో అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి చదువుకునేటప్పుడు చిన్న చిన్న కవితలు రాసే అలవాటు ఉండేదట. అలా తన చిన్న తనంలో ఉన్న రచనా నైపుణ్యానికి కాస్త పదును పెట్టి మంచు కొండల మధ్య చక్కని కథలు రాయడం మొదలుపెట్టారు.
ఆన్లైన్లో లక్షలాది అభిమానులు
రోజుకో మంచి కథ రాస్తూ ‘తెలుగు స్టోరీ ఎక్స్ప్రెస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఇవన్నీ మానవ సంబంధాలు, నైతిక విలువలతో కూడుకొని ఉంటాయి. నేటి తరంలో వృద్ధులను కొందరు పిల్లలు ఆదరించకుండా ఉండడం వల్ల వారు ఎంతటి మానసిక వేధనకు గురవుతున్నారనే కోణంలో హృదయాలను కదిలించే విధంగా రాస్తున్నారు. వీటిని లక్షల సంఖ్యలో నెటిజన్లు ఆదరిస్తున్నారు. ఆమె ఛానెల్కు వేల సంఖ్యలో సబ్స్క్రైబర్లు అయ్యారు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా తదితర దేశాల్లో తెలుగువాళ్లు సంధ్య కథలు వినడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ఇప్పటికి అంతర్జాలంలో ఈమె రాసిన కథల్ని 40 లక్షల మందికిపైగా చదివారంటే ఈ కథల్లో దాగున్న సందేశాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
హాయిగా వినొచ్చు
సంధ్య రాసిన కథలకు మరో ప్రత్యేకత ఉంది. ఎక్కువ సేపు చరవాణి తెరను చూస్తే కళ్లకు ఇబ్బంది కలుగుతుందనుకుంటే కథల్ని హాయిగా వినేయొచ్చు. ఛానెల్లోకి వెళ్లగానే కథ స్క్రిప్ట్తోపాటు సంధ్య స్వయంగా తన గొంతుతోనే కథను చక్కగా చెబుతూ ఆడియో కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
గొప్ప సందేశం..
వసంత, రాము దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. వీళ్లింట్లో లక్ష్మి అనే పనిమనిషి ఉంటుంది. ఆమె భర్త ఆటో డ్రైవర్. వీరికి అమృత అనే పాప ఉంటుంది. లక్ష్మి తనతో పాటు కూతురు అమృతను పనికి తీసుకొస్తుంటుంది. వసంత పిల్లల్ని ఆడిస్తుంటుంది అమృత. రోడ్డు ప్రమాదంలో అమృత తల్లిదండ్రులిద్దరూ తీవ్ర గాయాలై కన్నుమూస్తారు. అనాథ అయిన అమృతను పెంచుకుందామని వసంత అనుకుంటుంది. అందుకు భర్త రాము నిరాకరిస్తాడు. దీంతో అమృతను హాస్టల్లో వేసి వేరే ఊరికి బదిలీపై వెళ్లిపోతారు. ఓ పాతికేళ్ల తర్వాత.. వసంత ఓసారి దుకాణానికి వెళ్లినప్పుడు ‘ఆంటీ బావున్నారా’ అంటూ అమృత పలకరిస్తుంది. ఆమెను చూసి వసంత ఎంతో సంతోషించి ఇంటికి తీసుకెళుతుంది. పిల్లలు ఎక్కడ ఆంటీ? అని అమృత అడుగుతుంది. మంచి చదువులు చదివించాం. పెళ్లిళ్లు అయ్యాయి. విదేశాల్లో స్థిరపడ్డారు. తాము ఒంటరిగా మిగిలామని ఆ దంపతులు కన్నీటి పర్యంతమవుతారు. అప్పుడు అమృత కలగజేసుకొని ఆంటీ చిన్నప్పుడు నాకు ఎంతో చేశారు? నన్ను హాస్టల్లో వేశారు. బాగా చదివి ఇప్పుడు లెక్చరర్గా ఉద్యోగం సంపాదించా. నాకూ ఎవరున్నారు? అంకుల్, మీరు నాతో ఉండిపోండి అంటూ కన్నకూతురిలా తన ఇంటికి వారిని ఆహ్వానిస్తుంది. రాము ముఖంలో తీవ్ర పశ్చాత్తాపం. అనాథగా ఉన్న అమ్మాయిని ఆదరిద్దామంటే వద్దన్నా. కోటి ఆశలు పెట్టుకున్న కొడుకులు వదిలేసి వెళ్లారు. ఎప్పుడో చేసిన చిన్న సాయం గుర్తుంచుకొని అమృత తమను ఆదరిస్తోంది. అంటూ ఆ దంపతులు కన్నీటి పర్యంతమవుతారు.
వింటూ నిద్రపోతామని చెబుతారు
సంధ్య అడుపు, రచయిత్రి
సమాజంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఇతి వృత్తాలనే కథాంశాలుగా తీసుకొని రాస్తున్నా. ప్రతి రోజూ ఒక్కటైనా అప్లోడ్ చేస్తా. నా కథలు వింటూ నిద్రపోతామని అభిమానులు కామెంట్లు పెట్టడం చాలా సంతోషాన్నిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు