logo

ఆదర్శం ఆ గృహిణి.. ఒకేసారి రెండు ఉద్యోగాలు

పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం.. అలాంటిది ఓ గృహిణి హోటల్‌ నిర్వహిస్తూ..

Updated : 01 Mar 2024 07:57 IST

కేసముద్రం, న్యూస్‌టుడే:  పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం.. అలాంటిది ఓ గృహిణి హోటల్‌ నిర్వహిస్తూ.. ఖాళీ సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతో చదువు కొనసాగించారు. పోటీ పరీక్షలకు హాజరై ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన చీకటి జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. మండలంలోని కల్వల గ్రామానికి చెందిన నవీన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు మల్టీమీడియాలో శిక్షణ పొందుతుండగా రెండో కుమారుడు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. ఆ దంపతులు జీవనోపాధికోసం మండల కేంద్రంలో 2018 నుంచి హోటల్‌ నిర్వహిస్తున్నారు. హోటల్‌ నిర్వహణలో భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఏంఏ, బీఈడీ పూర్తి చేశారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగ పరీక్ష రాశారు. వారం రోజుల కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు. గురువారం వెలువరించిన జూనియర్‌ అధ్యాపకుల ఉద్యోగాల ఫలితాల్లోనూ అర్హత సాధించారు. రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆమె తన సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని