రూ.27.97 కోట్లతో వార్షిక బడ్జెట్
భూపాలపల్లి పురపాలక సంఘం వార్షిక బడ్జెట్(2024-25) రూపకల్పన చేసి, గురువారం కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు.
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
న్యూస్టుడే, భూపాలపల్లి: భూపాలపల్లి పురపాలక సంఘం వార్షిక బడ్జెట్(2024-25) రూపకల్పన చేసి, గురువారం కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. రూ.27.97 కోట్లతో కూడిన బడ్జెట్ను మున్సిపల్ ఛైర్పర్సన్ సెగ్గం వెంకటరాణితో పాటు కౌన్సిలర్లంతా ఆమోదం తెలిపారు. సమావేశానికి ఛైర్మన్తో పాటు 11 మంది వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి పద్దును రూ.1.41 కోట్లు ఎక్కువగా చూపారు. పన్ను రాబడి గతేడాది రూ.4.63 కోట్లు చూపితే ఈ సారి రూ.4.71 కోట్ల వరకు పెంచారు. గత పదేళ్లలో ఆస్తి, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ల ద్వారా వచ్చే ఆదాయానికి బాగా గండి పడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పన్ను రాబడిపై ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యం కల్పించారు. పన్నేతర రాబడి, వివిధ గ్రాంటుల ద్వారా ఈ ఏడాది రూ.4.50 కోట్లు చూపించారు. పారిశుద్ధ్య సిబ్బంది వేతనాల ఖర్చు ఈ సంవత్సరంలో ప్రతి నెలా రూ.35 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని, డీజిల్ ఖర్చు నెలకు రూ.4 లక్షలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి : భూపాలపల్లి పురపాలక సంఘం ఆదాయాన్ని పెంచడానికి ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ముఖ్యంగా ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ల ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తుందని.. గత పదేళ్లుగా నిర్లక్ష్యం చేశారన్నారు. సింగరేణి సంస్థతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావల్సిన పన్ను బకాయిలను వసూలు చేయాలని, ఐదేళ్లుగా మున్సిపాలిటీకి రావాల్సిన స్టాంప్ డ్యూటీ నిధులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావడం లేదని తెలిపారు. ఈ ఏడాదిలో ఆస్తి పన్ను ఇప్పటివరకు కేవలం 34 శాతం వసూలు కావడంతో నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని, వంద శాతం పన్నుల వసూలు కోసం అధికారులు, పాలక సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలతో పాటు, సింగరేణి సంస్థ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, శిరుప అనిల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అధికారులతో మాట్లాడి, ఆస్తి పన్ను బకాయిలు వెంటనే చెల్లించేలా కృషి చేస్తానని, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చే నిధుల విడుదల కోసం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులు ఈ జిల్లా అభివృద్ధికే కేటాయించాలని, ఇతర జిల్లాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలోనే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేసవిలో మున్సిపాలిటీ పరిధిలోని ఏ కాలనీలోనూ తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, మేనేజర్ స్వామి, ఆర్ఐ భాస్కర్, అకౌంట్ అధికారి అనితాదేవి, టీపీవో సునీల్, ఏఈ మానస, శానిటరీ ఇన్స్పెక్టర్లు నవీన్, శ్రీనివాస్ తదితర వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు