గొర్రెల పంపిణీ పథకం అమలయ్యేనా..?
తెలంగాణలో గత భారాస ప్రభుత్వం గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
సుమారు 4వేల మంది ఎదురు చూపులు
జనగామ రూరల్, న్యూస్టుడే: తెలంగాణలో గత భారాస ప్రభుత్వం గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2017లో ఈ పథకం ప్రారంభం కాగా.. ఒక్కో లబ్ధిదారునికి 20 ఆడ, ఒక పొట్టెలును కలుపుకొని మొత్తం 21 గొర్రెలను అందించింది. మొదట్లో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా, అందులో 75 శాతం ప్రభుత్వ రాయితీ 25 శాతం లబ్ధిదారుని వాటా చెల్లింపు చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 15,402 మంది లబ్ధిదారులకు గొర్రెలను అందించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో మరో 4వేల మందికి పైగా గొర్రెల యూనిట్లను అందించాల్సి ఉంది. రెండో విడత మాత్రం నత్తనడకన సాగింది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పథకం అమలుకు విరామం ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టడం.. పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని ప్రకటించి పశు, సంవర్ధక శాఖలో ఉన్నతాధికారులను బాధ్యులను చేయడం.. పథకం అమలుకు సర్కారు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో గొర్రెల పంపిణీ పథకం అమలుపై డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
సష్టత ఇవ్వాలి..
మంగ శ్రీను, (కోడూరు, రఘునాథపల్లి)
పథకం రెండో విడతలో లబ్ధిదారునిగా.. గత ఏప్రిల్ మాసంలో రూ.43,750లను చెల్లించాను. జీవాల పంపిణీకి గతంలో ఎన్నికల కోడ్ రావటంతో తాత్కాలికంగా ఆగిపోయింది. అనంతరం కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం పథకం అమలుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలో 4వేల మందికి పైగా లబ్ధిదారులం ఆశగా ఎదురు చూస్తున్నాô.
ప్రభుత్వం నగదు బదిలీ చేయాలి.. : సాదం రమేశ్ (గొర్రెల, మేకల పెంపకందారుల జిల్లా కార్యదర్శి, జనగామ)
గొర్రెల పంపిణీలో అక్రమాల పేరు చెప్పి పథకాన్ని నిలిపి వేయడం సరి కాదు. ఏవైనా అవకతవకలు జరిగితే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలే తప్పా.. లబ్ధిదారులకు మొండి చేయి చూపవద్దు. నగదు బదిలీ చేయాలి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు: మనోహర్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, జనగామ
జిల్లాలో రెండో విడతలో 4,499 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారు. ఇందులో 2,757 మంది డీడీలు చెల్లించగా.. 416 మంది లబ్ధిదారులకు గొర్రెలను అందించాం. మిగతా 2,341 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించి ఉన్నారు. ప్రభుత్వం పథకం అమలుపై ఎలాంటి ఆదేశాలు చేస్తారోనని ఎదురు చూస్తున్నాం. ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
జిల్లాలో పరిస్థితి ఇలా..
మొత్తం లబ్ధిదారుల సంఖ్య: 21,704
మొదటి విడత కింద : 16,275
లబ్ధిపొందిన వారు: 15,042
రెండో విడత కింద : 4,499
లబ్ధిపొందిన వారి సంఖ్య: 416
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్