‘గ్రేటర్’లోనే ఎందుకిలా..
కరీంనగర్, ఖమ్మం నగరపాలక సంస్థలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. కారణం ఐఏఎస్ కమిషనర్లు రెండేళ్ల పాటు పనిచేస్తున్నారు.
కమిషనర్ల బదిలీలతో పాలన అస్తవ్యస్తం
కరీంనగర్, ఖమ్మం నగరపాలక సంస్థలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. కారణం ఐఏఎస్ కమిషనర్లు రెండేళ్ల పాటు పనిచేస్తున్నారు. గ్రేటర్ వరంగల్లో పనిచేసేవారు ఏడాది దాటకముందే బదిలీలయ్యారు. గత పదేళ్లలో ఎనిమిది మంది కమిషనర్లు మారారు. వీరిలో ఏడుగురు ఐఏఎస్లు, ఒక్క నాన్ ఐఏఎస్ ఉన్నారు. కొత్తగా వచ్చేవారికి మున్సిపల్ నిబంధనలు, వ్యవహారాలు తెలిసేందుకు 3-4 నెలల సమయం పడుతోంది. అన్ని తెలిసే లోపే బదిలీ బాట పడుతున్నారు.
కార్పొరేషన్, న్యూస్టుడే: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. దేశంలో ఏ నగరానికీ దక్కని స్మార్ట్సిటీ, అమృత్, స్మార్ట్సిటీ త్రీ ఇన్ వన్ పథకాలు దక్కాయి. చారిత్రక నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు గొప్ప అవకాశం ఉంది. తరచూ గ్రేటర్ వరంగల్ కమిషనర్ల బదిలీలతో నగరాభివృద్ధి కుంటుపడుతోంది. కమిషనర్ల నియామకంలో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడం, ఏకాభిప్రాయం ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది.
ఐఏఎస్ అధికారి రిజ్వాన్ బాషా తొమ్మిది నెలలకే జనగామ పాలనాధికారిగా బదిలీ అయ్యారు. దీంతో గతంలో కమిషనర్గా పనిచేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను ఇన్ఛార్జి కమిషనర్గా నియమించారు. త్వరలో లోక్సభ ఎన్నికలొస్తున్నాయి. వరంగల్ జిల్లా కలెక్టర్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)గా వ్యవహరిస్తారు. సుమారు రెండు నెలల పాటు తీరిక లేకుండా ఉంటారు. ఆమె వరంగల్ జిల్లా పాలనాధికారిగా, గ్రేటర్ వరంగల్ కమిషనర్ బాధ్యతలు చూడాలి.
ఇన్ఛార్జి కమిషనర్గా వరంగల్ పాలనాధికారి ప్రావీణ్య
వరంగల్ మహా నగరపాలక సంస్థ పూర్తి అదనపు బాధ్యతల కమిషనర్గా వరంగల్ జిల్లా పాలనాధికారి పి.ప్రావీణ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవోనంబరు 327 జారీ చేశారు. పూర్తిస్థాయి కమిషనర్ వచ్చే వరకు కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు వరంగల్ కలెక్టరేటులో ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. అదనపు కమిషనర్ రషీద్, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇదీ పరిస్థితి..
- వరంగల్ నగర విస్తీర్ణం 406 చదరపు కిలో మీటర్లు, 66 డివిజన్లు ఉన్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ ఉంటే అన్ని సవ్యంగా సాగుతాయి. లేదంటే అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు.
- వేసవి కాలం మొదలైంది. ఎండల తీవ్రత పెరగక ముందే కాలనీల్లో తాగునీటి సమస్య మొదలైంది. ఇంత వరకు వేసవి కాలంలో అనుసరించాల్సిన ప్రణాళిక ప్రతిపాదనల్లోనే ఉంది. అద్దె వాటర్ ట్యాంకర్లు కావాలి, లీకేజీలు అరికట్టాలి చేతి పంపుల మరమ్మతులపైనా ఇంకా నిర్ణయం తీసుకొలేదు.
- వరంగల్ త్రినగరాలకు గత 15 ఏళ్లుగా ముంపు తప్పడం లేదు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని ప్రధానమైన నాలాల పూడికతీత పనులు చేపట్టాలి. ఇంత వరకు ప్రతిపాదనలే తయారు కాలేదు. 40 నాలాలు పూడిక తీయాలి. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల మధ్య సమన్వయం లేదు.
- నగరంలోని 66 డివిజన్లలో సమస్యలున్నాయని ఇప్పటికే పార్టీల కతీతంగా కార్పొరేటర్లు ఏకమయ్యారు. సమస్యలపై చర్చించేందుకు రెండు రోజుల పాటు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని మేయర్ సుధారాణికి వినతి పత్రం ఇచ్చారు. డివిజన్లకు నిధులిస్తామంటేనే బల్దియా బడ్జెటు ఆమోదిస్తామని అల్టిమేట్టం ఇచ్చారు.
- పట్టణ ప్రణాళిక, పన్నుల విభాగాల్లో దస్త్రాలు కదలడం లేదు. బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజావాణి అర్జీలు పరిష్కారానికి చొరవ చూపడం లేదు. అన్ని విభాగాల్లో వందల సంఖ్యలో దస్త్రాలు పెండింగ్లో ఉన్నాయి.
- ఆస్తి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్సు రుసుముల వసూళ్లలో పురోగతి లేదు. ప్రస్తుతం బల్దియా ఖజానా ఖాళీగా ఉంది. ఆదాయం చాలా అత్యవసరం. అధికారుల పర్యవేక్షణ లేక పన్నుల వసూళ్లు మందగించాయి.
‘కుడా’ ఎలా..
గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే గ్రేటర్ వరంగల్ కమిషనర్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఇన్ఛార్జి వైస్ ఛైర్మన్గా ఉంటున్నారు. కమిషనర్లు బదిలీల ప్రభావం ‘కుడా’పైనా ఉంటుంది. అక్కడా పాలన అదుపు తప్పుతోంది. ఇన్ఛార్జి కమిషనర్గా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు అదనపు బాధ్యతల ఉత్తర్వుల్లో ‘కుడా’ వీసీ బాధ్యతల ఊసే లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే