పెరిగిన కొలువుల ఆశలు..!
రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది.. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేస్తూ.. అప్పటి పోస్టులకు మరిన్ని ఖాళీలను కలిపి గురువారం ప్రకటన వెలువరించింది.
మెగా డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం
హనుమకొండలోని గ్రంథాలయంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఉద్యోగార్థులు
రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది.. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేస్తూ.. అప్పటి పోస్టులకు మరిన్ని ఖాళీలను కలిపి గురువారం ప్రకటన వెలువరించింది. దీంతో ఉమ్మడి వరంగల్లోని డీఎడ్, బీఎడ్ శిక్షణ పూర్తి చేసి..టెట్ అర్హత పొందిన వేలాది మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్టుడే, ఎన్జీవోస్కాలనీ
పెరిగిన పోస్టులు: గత ప్రభుత్వ హయాంలో వచ్చి డీఎస్సీ ప్రకటనలో ఉమ్మడి జిల్లాలోని అన్ని విభాగాల్లో 532 ఖాళీలను చూపించారు. అవి కాకుండా ప్రస్తుతం 856 స్కూల్ అసిస్టెంట్లు, భాషాపండితులు, ఎస్జీటీలు, 131 స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులతో 1519 ఖాళీలను చూపించారు. వ్యాయామ ఉపాధ్యాయులు మినహా మిగిలిన విభాగాలన్నింటిలో పోస్టుల సంఖ్య పెరిగింది. పెంచిన ఖాళీల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ 334, ఎస్జీటీలు 922, భాషాపండితులు 102, వ్యాయామ ఉపాధ్యాయులు 30, స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయులు 26, ఎస్జీటీ ప్రత్యేక ఉపాధ్యాయులు 105 పోస్టులను ఖాళీలుగా చూపారు.
తెరుచుకోనున్న బడులు: బడులు లేని ఊరు ఉండకూడదని.. ఆ మేరకు నియామకాలు చేపడుతామని సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా మెగా డీఎస్సీ ప్రకటన వెలువరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త ఉపాధ్యాయులతో మూసివేసిన బడులు తెరుచుకోవడమేగాక ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత సమస్య కూడా తీరనుంది.
సంతోషంగా ఉంది : సుభద్ర, డీఎస్సీ అభ్యర్థిని వరంగల్
పోస్టులు పెంచడం సంతోషంగా ఉంది. ఎలాంటి చిక్కులు లేకుండా పరీక్షను త్వరితగతిన పూర్తి చేయాలి. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి బడికి వెళ్లేలా చూడాలి.
పలువురికి ప్రయోజనం: వెన్నెల, డీఎస్సీ అభ్యర్థిని, హనుమకొండ
స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ పోస్టు కోసం చదువుతున్నా. ప్రభుత్వం పోస్టులను పెంచుతూ ప్రకటన వెలువరించడం సంతోషంగా ఉంది. నిరుద్యోగులకు మేలు కలగనుంది.
పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి:పెండెం రాజు టీఎస్యూటిఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, హనుమకొండ
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పోస్టులకు మరిన్ని కలుపుతూ కొత్తగా ప్రకటన వెలువరించడం హర్షణీయం. ఇప్పటికే బడుల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు నష్టపోయారు. ఈ డీఎస్సీ ద్వారా ఆ కొరత తీరబోతుంది. మారుమూల ప్రాంతాల్లో పోస్టులను భర్తీ చేయాలి. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి కాలయాపన చేయకుండా పోస్టింగ్లు ఇవ్వాలి. ప్రస్తుత ఉపాధ్యాయులకు వేసవిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు