కృష్ణానది బాగుకు అందరి భాగస్వామ్యం అవసరం
గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు జీవ నదుల ప్రక్షాళనకు నడుం కట్టింది.
ఆచార్య ఎన్.వి.ఉమామహేశ్
గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు జీవ నదుల ప్రక్షాళనకు నడుం కట్టింది. ఈ క్రమంలో కృష్ణానది కాలుష్యనివారణ బాధ్యతలను వరంగల్ ఎన్ఐటీతోపాటు కర్ణాటకలోని నిట్ సూరత్కల్కు అప్పగించింది. ఈ ప్రాజెక్టుకు వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆచార్య ఎన్.వి.ఉమామహేశ్ నేతృత్వం వహించనున్నారు. కృష్ణానది ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరగనుంది? ప్రాజెక్టు పూర్తయ్యాక మనకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై గురువారం ‘ఈనాడు’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.
ఈనాడు, వరంగల్
నదుల పరిరక్షణకు అయిదు సూత్రాలు
కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి మార్గనిర్దేశం చేసింది?
అయిదు సూత్రాల ఆధారంగా పనిచేయాలని చెబుతున్నారు. అవిరళ గంగ.. అంటే జీవనదిలా ప్రవహించాలి. నిర్మల్ గంగ.. నదిలోని నీరు స్వచ్ఛంగా మార్చాలి. జనగంగ.. ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. అర్థ గంగ.. ప్రక్షాళన ప్రక్రియ కావాలంటే తగినంత డబ్బు వెచ్చించాలి. చివరిది జ్ఞాన గంగ. నది వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరాలి. నది మనుగడకు ఇవి అయిదు స్తంభాల్లాంటివని చెబుతున్నారు. ఈ పంచ గంగ సూత్రాలను జలశక్తి శాఖ మార్గదర్శనం చేస్తోంది.
కృష్ణానదిలో కాలుష్య నివారణ చర్యలు ఎలా చేపట్టనున్నారు?
నమామి గంగే ప్రాజెక్టు గురించి మనందరికీ తెలిసిందే. దానికి ఐఐటీ కాన్పూర్ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఆ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తుండడంతో దేశంలోని మిగతా జీవనదుల ప్రక్షాళన బాధ్యతలను జాతీయ సాంకేతిక సంస్థలకు అప్పగించాలని కేంద్రం నడుం కట్టింది. కేంద్రజలశక్తి శాఖకు అనుసంధానంగా పనిచేసే ‘జాతీయ నదుల పరిరక్షణ విభాగం’ కృష్ణా నదిని ప్రక్షాళన చేసే బాధ్యతలను మనతోపాటు కర్ణాటకలోని సూరత్కల్ నిట్కు అప్పగించింది. దీనికి సంబంధించిన వరంగల్ నిట్లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణానది దాని పరివాహక ప్రాంతం ప్రస్తుత పరిస్థితిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. నదిలో ప్రస్తుత ప్రవాహం ఎలా ఉంది? ఏ మేరకు కలుషితమైంది? అలా కావడానికి ప్రధాన కారణాలు, బాగు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మూడేళ్లలో సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తాం. దాని ఉపనదులనూ అధ్యయనం చేస్తాం. గోదావరి నది ప్రక్షాళన చర్యలను ఐఐటీ హైదరాబాద్ చేపట్టనుంది.
ఈ ప్రాజెక్టుకు ఏ మేర నిధులు మంజూరు చేశారు?
ప్రాజెక్టు పేరు ‘సెంటర్ ఫర్ కృష్ణా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్టడీస్’. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల వరకు నిధులు ఇవ్వనుంది. అలా మూడేళ్లలో రూ.6 కోట్ల వరకు వస్తాయి. నివేదిక ఇచ్చాక తదనంతర పరిరక్షణ చర్యలకు మళ్లీ నిధులొచ్చే అవకాశం ఉంది. నిధులకన్నా ముఖ్యం అందరి భాగస్వామ్యం కావాలి. నదులను మన భారతీయులు ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. వాటిలో మునిగితే పాపాలు పోతాయని నమ్ముతారు. అలాంటి నదులు ఇప్పుడు కనీసం స్నానాలు చేయడానికి పనికిరాకుండా పోవడానికి కారణం పరిశ్రమల వ్యర్థాలతోపాటు అనేక మానవ వ్యర్థాలు కలవడమే. నదులు పూర్వ స్థితికి రావాలంటే ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. స్థానిక సంస్థలు చేయి కలపాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రజలూ అందులో భాగస్వామ్యం అయితేనే ఫలితం ఉంటుంది. మా ప్రాజెక్టులో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటుచేసి ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తాం.
గతంలో నిట్ నుంచి నదులపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు? వాటి అనుభవం పనికొస్తుందా?
నిట్లోని సివిల్ ఇంజినీరింగ్ విభాగంలోని జల, పర్యావరణ విభాగం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీనికి నేనే నేతృత్వం వహిస్తున్నా. గతంలో నా కింద పలువురు పరిశోధక విద్యార్థులు కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ఆనకట్ట, తుంగభద్ర నదులపై పరిశోధనలు చేశారు. నదులు, సరస్సులపై అనేక ప్రాజెక్టులు చేపట్టిన నిపుణులు మన వద్ద ఉన్నారు. మనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తామనే విశ్వాసం ఉంది.
ఈ ప్రాజెక్టు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
నది పరివాహక ప్రాంతం అంటే జీవ కళ ఉట్టిపడే ప్రదేశం. జీవ వైవిధ్యానికి, ప్రజల మనుగడకు నదులు ఎంతో కీలకం. కృష్ణా నది శుద్ధీకరణ పూర్తయ్యి పూర్వ స్థితికి వస్తే అది ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్