నేడు మేడిగడ్డకు భారాస శ్రేణులు
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల పుట్ట అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష భారాస శ్రేణులు శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టాయి.
సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా భారాస నేతలు
మహదేవపూర్, కాళేశ్వరం న్యూస్టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల పుట్ట అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష భారాస శ్రేణులు శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టాయి. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, భారాస ముఖ్య నేతలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 200 మంది భారాస శ్రేణులు తరలిరానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరుతారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అన్నారం బ్యారేజీని సందర్శిస్తారు. అనంతరం అన్నారం బ్యారేజీ వ్యూపాయింట్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. వీడియో ప్రదర్శన కూడా ఉండే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం...
తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ ఆరోపించారు. చలో మేడిగడ్డ నేపథ్యంలో బ్యారేజీ వద్ద ఏర్పాట్లను వారిద్దరు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్లలో ఒక 20వ పిల్లర్ కుంగిపోతే, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ నుంచి సుమారు ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్లిపోతుందని చెప్పారు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించలేక కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని భారాస అధినేత కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి తెలయపర్చాలని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్ర బుద్ధి ప్రపంచానికి చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఏ ప్రాంతంలో నాయకులు పరిశీలించాలో, తగిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.
చలో మేడిగడ్డను జయప్రదం చేయాలి
హనుమకొండ కలెక్టరేట్: కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి, ప్రజలకు వాస్తవాలు వివరించడానికి శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమానికి భారాస పిలుపునిచ్చిందని, దీన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. గురువారం ఆయన హనుమకొండలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ నుంచి ప్రారంభమై, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ బైపాస్, గుడెప్పాడ్, పరకాల, భూపాలపల్లి మీదుగా కొనసాగుతుందని చెప్పారు. దారి పొడవునా భద్రతా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ను కోరినట్లు తెలిపారు. తెలిసీ తెలియక మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని అర్థమయ్యేలా సజీవంగా చూపెడతామన్నారు. కార్యక్రమంలో శానమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ స్పీకర్ మధుసూద]నాచారి, మాజీ మంత్రి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం