Warangal: నేను మేడారం.. నన్ను బాగు చేయండి
అందరికీ శుభోదయం. నేనండి మీ మేడారాన్ని. తల్లులకు నెలవై... అన్ని వర్గాలకు కొలువై...కోటిన్నర మందిని అక్కున చేర్చుకున్నా. నా చెంత విధులు నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అమ్మల దర్శనానికి వచ్చిన ప్రముఖులతో పాటు భక్త జనానికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డా.
అందరికీ శుభోదయం. నేనండి మీ మేడారాన్ని. తల్లులకు నెలవై... అన్ని వర్గాలకు కొలువై...కోటిన్నర మందిని అక్కున చేర్చుకున్నా. నా చెంత విధులు నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అమ్మల దర్శనానికి వచ్చిన ప్రముఖులతో పాటు భక్త జనానికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డా. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, కాలినడకన... ఇలా ఎవరెలా చేరుకున్నా అందరినీ మళ్లీ సురక్షితంగా ఇళ్లకు పంపా. మహాజాతర అంగరంగ వైభవంగా జరిగింది. గత బుధవారం తిరుగువారం పండగతో జాతర ముగిసింది. అలాగని నన్ను ఇప్పుడు అనాథను చేయకండి. ఇప్పుడు నన్నే నమ్ముకుని ఉంటున్న గ్రామస్థుల బాగోగులు చూసుకోవాల్సిన గురుతర బాధ్యత నాపై ఉంది. ఇందుకు అధికార గణం, స్వచ్ఛంద సంస్థల సహకారం కావాలి. తిరుగువారం ముగిసినందున నాలుగు మాటలు చెబుదామని మీ ముందుకు వచ్చాను. నా సూచనలు, సలహాలు పాటిస్తూ నన్ను బాగు చేస్తారని ఆశిస్తున్నా...
బాధ్యతగా పరిసరాలు శుభ్రం
కోటిన్నర మంది వచ్చి పోయిన చోట మురుగు కాలువల స్వరూపం ఎలాగుంటుందనేది ఊహించండి. చెత్తా చెదారం పేరుకుపోయింది. కొన్ని చోట్ల దుర్వాసన వస్తోంది. దోమల బెడద అధికమైంది. నా ప్రజలు తీవ్ర మనోవేదనతో ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ నాదొక్కటే విన్నపం.. పరిసరాలు శుభ్రం చేయండి. జాతరకు ముందు ఎలా ఉందో...ఇప్పుడలా తయారు చేయండి.
జంపన్న వాగును చూడండి
జంపన్న వాగులో లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. జలకాలాటలాడారు. పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. బాగు చేయండి. భవిష్యత్తు తరాలను నేను సమాధాన పరచాలి. ఇందుకు మీ తోడ్పాటు తప్పనిసరి
ఇంటింటా వైద్య పరీక్షలు తప్పనిసరి
జాతరప్పుడు ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి నడిపారు. పరిసరాల్లో వైద్య శిబిరాలు నెలకొల్పారు. ఆపదలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించారు. ఇప్పుడిక ఎల్లవేళలా నా దగ్గర ఉండే ప్రజల అవసరాలు చూడాలి. ముందుగా అందరిని ఆరోగ్యవంతులు చేయాలి. ఇంటింటా వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేస్తే ఇది సాధ్యమవుతుంది. గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా శిబిరాలు నిర్వహించండి.
ప్లాస్టిక్తోనూ ముప్పుంది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వస్త్ర సంచులు వినియోగించిన వారికి రుణ పడి ఉంటా. ప్లాస్టిక్తో పొంచి ఉన్న ముప్పు గురించి మీకు తెలియంది కాదు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎక్కడ ప్లాస్టిక్ ఉన్నా తొలగించండి. మీరు మేల్కొంటే అందరికి మంచి చేసిన వారవుతారు.
క‘న్నీటి’ కష్టాలు తొలగించండి
జాతర సమయంలో నీటి కోసం భక్తులు ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలం ఇంకి నీటికి కొరత ఏర్పడింది. ఇంకొన్ని ప్రదేశాల్లో నీరు వృథాగా పోయింది. ఇప్పుడు వేసవిలో అడుగు పెట్టాం. నా ప్రజల క‘న్నీటి’ కష్టాలు తొలగించండి. ఎక్కడైనా లీకేజీలుంటే నివారించండి. నీటి సరఫరా జరగని ప్రాంతాలుంటే గుర్తించండి. దాహార్తికి తోడు గ్రామస్థుల అవసరాలకు సరిపడే నీరు ఉండేలా చూడండి
ఆ తల్లుల దీవెనలు ఎప్పటికీ మీకు ఉండాలని కోరుకుంటూ..
మీ మేడారం..
న్యూస్టుడే, డోర్నకల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు - ఈటీవి ఆధ్వర్యంలో వన మహోత్సవం
[ 26-07-2024]
ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
[ 26-07-2024]
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
[ 26-07-2024]
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
[ 26-07-2024]
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆకర్షక పద్దు
[ 26-07-2024]
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వారికి అన్ని విధాలుగా మేలు చేసేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులు చేశారు. అభివృద్ధే అజెండాగా.. సంక్షేమం దండిగా ఉండేలా ఆర్థిక పద్దు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
పంచాయతీల్లో కానరాని పౌర సేవల పట్టికలు
[ 26-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీల్లో ప్రజలకు పౌర సేవలు అరకొరగానే అందుతున్నాయి. పంచాయతీలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో సూచిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా పౌరసేవల పట్టికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
విశ్వ క్రీడల కీర్తి.. ఓరుగల్లు పొందాలి స్ఫూర్తి
[ 26-07-2024]
ఒలింపిక్స్లో పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. అసాధ్యమూ అంతకన్నా కాదు. కావాల్సిందల్లా గట్టి సంకల్పం, పట్టుదల, కృషి. ఉమ్మడి వరంగల్లో క్రీడాకారుల ప్రతిభకు కొదువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి సానబెడితే ఒలింపిక్స్కు మనవాళ్లు అర్హత సాధించడం పెద్ద సమస్యే కాదు. -
ఆయన లేని లోకంలో ఉండలేనని..
[ 26-07-2024]
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. వివాహబంధంతో ఒకటయ్యారు.. కష్టసుఖాలు పంచుకున్నారు.. పిల్లలను ప్రయోజకులను చేశారు.. అరవై ఏళ్లు తోడు-నీడగా ఉన్నారు.. మలి సంధ్యలోనూ నీకు నేను...నాకు నువ్వు అనుకుంటూ జీవిస్తున్నారు.. ఇంతలో భర్త హఠాన్మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.. -
ఎక్సైజ్కాలనీ.. ఎక్కడ చూసినా సమస్యలే
[ 26-07-2024]
హనుకొండ నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అన్ని అనుమతులతో ఐదు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడింది. ఇప్పకీ కొన్ని వీధుల్లో డ్రైనేజీలు లేవు. రోడ్డు నెంబర్ 5సీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. -
సరిహద్దులో పేలిన తూటా!
[ 26-07-2024]
కొన్నాళ్లుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరు సాగుతోంది. గురువారం ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని గుండాల-తాడ్వాయి మండలాల పరిధిలోని దామెరతోగు, కరకగూడెం అటవీ ప్రాంతంలో తుపాకీ తూటాల మోతలు మోగాయి. -
ఠాణాల్లో భూ తగాదాలు.. సివిల్ పంచాయితీలు!
[ 26-07-2024]
జిల్లా పరిధిలోని కొన్ని పోలీసు సబ్ డివిజన్లలో సీఐలు, ఎస్సైల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఠాణాల్లో యథేచ్ఛగా భూ పంచాయితీలు, సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూరుస్తూ అమ్యామ్యాయాలు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మాదిరిగానే వ్యవహరించగా జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
[ 26-07-2024]
శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్