అతివలూ.. కాస్త శ్రమిస్తే ఆరోగ్యమస్తు
మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ సమయం వ్యాయామం చేసినా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయట.. అమెరికాలో ఇటీవల తేలిన సర్వే సత్యమిది.
మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ సమయం వ్యాయామం చేసినా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయట.. అమెరికాలో ఇటీవల తేలిన సర్వే సత్యమిది.. కాలిఫోర్నియాలోని స్మిట్హార్ట్ ఇన్స్టిట్యూట్ 1997 నుంచి 2019 వరకు ఏకంగా 4 లక్షల మందిని అధ్యయనం చేసి చెప్పిన సంగతి ఇది. మహిళలు తరచూ కొద్దిసేపు వ్యాయామం చేసినా మరణ ముప్పు 24 శాతం తగ్గుతుందట. ఇదే ఫలితం మగవారు పొందడానికి చాలా ఎక్కువ శ్రమించాలట. మరెందుకు ఆలస్యం..? అతివలు తమ ఆరోగ్యంపై శ్రద్ధపెడితే సత్ఫలితాలు సాధ్యమవుతాయి. -ఈనాడు, వరంగల్
మహిళలు ఇంటిల్లిపాది బాగోగులను చూసుకుంటారు. అమ్మగా, భార్యగా, బిడ్డగా అనేక పాత్రల్లో కుటుంబానికి ఎన్నో విధాలుగా తోడునీడలా నిలుస్తున్నారు. ఇంటి, వంట పనులు చేసుకుంటూనే కంగారుగా కార్యాలయానికి వెళ్లి పనిచేస్తారు. మళ్లీ ఇంటికొచ్చి విశ్రాంతి లేకుండా పనుల్లో నిమగ్నమవుతారు. తమ ఆరోగ్యంపై శ్రద్ధలేకుండా ఇలాంటి జీవనశైలితో గడిపితే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఉరుకుల పరుగుల జీవనంలో ఆరోగ్యం కోసం కొంతలో కొంత సమయాన్ని కేటాయించుకోవడం చాలా ముఖ్యం.
చిన్న కసరత్తులైనా సరే..
ప్రతి రోజూ వ్యాయామశాలకు వెళ్లి భారీ కసరత్తులు చేయడం సాధ్యం కాకపోవచ్చు.. అదెంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే మహిళలు రోజుకు కనీసం ఓ అరగంటయినా నడిస్తే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఓరుగల్లు నగరంతోపాటు పరకాల, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్, భూపాలపల్లి ఇలా చిన్న పట్టణాల్లో సైతం వ్యాయామం కోసం ఆయా పురపాలక సంస్థలు ప్రత్యేక పార్కులను తీర్చిదిద్దాయి. ఇక్కడ ఆడవారి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వాకింగ్ట్రాక్లతోపాటు చిన్నపాటి వ్యాయామాలు చేసేందుకు పరికరాలు అందుబాటులో పెట్టారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్కు ప్రతిరోజూ ఉదయం పెద్దసంఖ్యలో మహిళలు వచ్చి కనీసం అరగంట కసరత్తులు చేసి వెళ్తున్నారు. కొద్ది సేపైనా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటామని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దరిచేరవని సంధ్య అనే మహిళ వివరించారు.
ప్రతి రోజూ వ్యాయామం
- మానస, పస్రా, ములుగు జిల్లా
వ్యాయామం నా దినచర్యలో భాగంగా చేస్తా.. ప్రతి రోజూ కొంత సేపు నడక, కనీసం 45 నిముషాల పాటు చిన్నచిన్న కసరత్తులు చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. శరీరం దృఢంగా ఉంటుంది. అలసట తెలియదు.
అవగాహన అవసరం
- డాక్టర్ బి.విజయలక్ష్మి, గైనకాలజిస్టు, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి
ఆడవారు ఆరోగ్యంపై కచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. అమ్మాయిలు కౌమార దశకు వచ్చినప్పటి నుంచి పలు రకాల సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది. ప్రధాన సమస్య రక్తహీనత.. హార్మోన్ల అసమతుల్యతతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ డిజార్డర్, మధుమేహం, రక్తపోటు లాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో మహిళలకు వచ్చే రుగ్మతలపై వారికి అవగాహన చాలా తక్కువ.. ప్రతి ఆరు నెలల నుంచి ఏడాదికోసారి రక్తపరీక్షలు చేసుకొని అవసరమైన మందులు వాడుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇటీవల ఎక్కువ మందిలో కనిపిస్తోంది. రిస్క్ను బట్టి కనీసం మూడేళ్లకోసారి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. అన్ని రకాల సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
సమయపాలన ఉండాలి
- అల్పాహారం - ఉదయం 8 గంటలకు (గుడ్డు, పాలు, మొలకొచ్చిన ధాన్యాలు)
- భోజనం - మధ్యాహ్నం - 1.30 గంటలకు (తగిన మోతాదులో అన్నం, ఎక్కువ కూరగాయలు, పప్పులు, అప్పుడప్పుడు మాంసం, చేపలు)
- రాత్రి భోజనం - 8.30 గంటలకు (ఓట్్స, జొన్న, రాగి రొట్టె, ఉడికించిన కూరగాయలు)
- ఇవి బాగా తినాలి
విటమిన్ - సి కలిగిన ఆహార పదార్థాలైన ఆకు కూరలు, కూరగాయలు, నిమ్మకాయ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత