ఆదేశాలున్నా.. కోతలు ఆగలే!
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. అవేవీ పట్టించుకోని ప్రైవేటు ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయంగా ఎక్కువ మొత్తంలో శస్త్ర చికిత్స ప్రసవాలనే చేపడుతున్నాయి.
భూపాలపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవాల వివరాలు పరిశీలిస్తున్న ప్రోగ్రాం అధికారులు
న్యూస్టుడే, భూపాలపల్లి కలెక్టరేట్: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. అవేవీ పట్టించుకోని ప్రైవేటు ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయంగా ఎక్కువ మొత్తంలో శస్త్ర చికిత్స ప్రసవాలనే చేపడుతున్నాయి. భవిష్యత్తులో మహిళలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారని తెలిసినా అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రసవాల లెక్కలను పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 47 వేలకు పైగా ప్రసవాలు జరిగితే అందులో 33 వేలకు పైగా శస్త్రచికిత్సలే ఉన్నాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు 41.04 శాతం ఉండగా సీ సెక్షన్ ఆపరేషన్లు 58.95 శాతం ఉంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిశీలిస్తే.. 87.12 శాతం సీ సెక్షన్ ప్రసవాలు చేస్తుంటే.. కేవలం 12.87 శాతం మాత్రమే సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సాధారణ కాన్పులు చేయడం ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆదేశాలు జారీచేసింది. మొదటి కాన్పు కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలని.. ప్రైవేటులో చేస్తే అందుకు తగిన కారణాలను వెల్లడిస్తూ సాధారణ ప్రసవం చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని చెబుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు పెడచెవిన పెడుతున్నాయి.
భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి...
- డాక్టర్ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారిణి
అవసరం లేకున్నా ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేయడంతో మహిళల్లో భవిష్యత్తులో పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆపరేషన్ చేసిన ప్రదేశంలో గాయం మానకపోడవం, అనస్థీషియా సమస్యలు, తల్లి కోలుకునే వరకు ఎక్కువ సమయం పట్టడం, మరీ ముఖ్యంగా శస్త్రచికిత్స సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం జరుగుతుంటాయి. గర్భాశయ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సీ సెక్షన్ ప్రసవాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.
అనవసరంగా చేసే ఆసుపత్రులపై చర్యలు
- డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం సాధారణ కాన్పులకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జనవరిలో హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేసే ప్రసవాలపై సదరు ఆసుపత్రులు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స ఆపరేషన్లకు సరైన కారణం లేకుంటే నోటీసు అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?