లెక్కకు మించి హాకర్లు.. అడ్డగోలు అమ్మకాలు!
కాజీపేట రైల్వే స్టేషన్లో అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి వందల సంఖ్యలో హాకర్లతో అమ్మకాలు సాగిస్తూ రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులను ఇబ్బంది కలిగిస్తున్నారు.
కాజీపేట రైల్వే స్టేషన్లో అధిక ధరలకు నాసిరకం ఆహారం
న్యూస్టుడే కాజీపేట
కాజీపేట రైల్వే స్టేషన్లో అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి వందల సంఖ్యలో హాకర్లతో అమ్మకాలు సాగిస్తూ రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులను ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎక్కువ ధరలకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారు. స్టేషన్లో కాకుండా బయట వంటలు చేయించడం వల్ల పర్యవేక్షణ లోపిస్తోంది. ఈ అంశంపై ఆన్లైన్లో రైల్వేకు అనేక ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇదేమని అడిగితే అంతే..
రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లో హాకర్లు రాజ్యమేలుతున్నారు. వారి పెట్టిందే ధర, ఇచ్చిందే ఆహారం. ఇదేమిటంటే చాలు మీద పడిపోతారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు చెందిన హాకర్లు వచ్చి భయానక వాతావరణం సృష్టిస్తారు. స్టేషన్లలో అమ్మకాలు చేసే వ్యక్తికి రైల్వే ఇచ్చిన గుర్తింపుతో పాటు హెల్త్కార్డు ఉండాలి. రైల్వే ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్యులతో పరీక్షలు చేయించుకుని వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. చాలా మందికి ఇలాంటి పత్రాలు లేవు. వీరిని నియంత్రించాల్సిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పట్టించుకోవడం లేదు.
నిబంధనలకు విరుద్ధంగా స్టాళ్లు..
స్టేషన్లో నిబంధనలకు విరుద్ధంగా స్టాల్స్ నిర్మాణం జరిగినా, ప్రయాణికులకు అడ్డుగా ఉన్నా పట్టింపు ఉండదు. రైల్వే నిబంధనల ప్రకారం 10శ్రీ6 ఫీట్ల సైజులో మాత్రమే స్టాల్స్ నిర్మాణం జరగాలి. ఈ నిబంధన పాటించడంలేదు. రెండు నెలల కిందట డివిజనల్ రైల్వే మేనేజర్కు అనుమానం కలిగి రెండు స్టాళ్లను దగ్గరుండి కొలిపిస్తే ఎక్కువగా ఉన్నట్లు రుజువు కావడంతో సదరు గుత్తేదారు లీజును రద్దు చేశారు. ఇంకా ఇలాంటి స్టాళ్లు ప్లాటుఫారం మీద ఉన్నాయి.
అపరిశుభ్రంగా వంట గదులు..
కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రస్తుతం అమ్మే వంటకాలన్నీ కాజీపేటలోని వివిధ ప్రాంతాల్లో వండుకుని వస్తున్నారు. ప్రస్తుతం ఐదు చోట్ల ఇలాంటి వంటగదులు ఉన్నాయి. ఇవన్నీ అపరిశుభ్ర వాతావరణంలో ఉంటాయి. వంట గదులను ఎప్పటికప్పుడు రైల్వే కమర్షియల్ అధికారులు తనిఖీ చేయాలి.. వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాలపై అధికారులను వివరణ కోరగా స్పందించలేదు.
లీజుల మీద లీజులు..
కాజీపేట రైల్వే స్టేషన్లో ఒకటో నెంబరు ప్లాటుఫారం మీద గల ఒక స్టాల్ను దక్షిణ మధ్య రైల్వేలో బడా కంపెనీగా పేరున్న సంస్థ దక్కించుకుని మరో వ్యక్తికి లీజుకు ఇచ్చింది. దీన్ని సబ్లీజు తీసుకున్న వ్యక్తి రోజుకు రూ.9 వేలు ఆ సంస్థకు చెల్లించాలి. సబ్లీజుదారు సమోస, నీరు, తేనీరు.. ఇలా అన్ని రకాల అమ్మకాలను వేర్వేరుగా చేసి మరల లీజుకు ఇచ్చారు. సమోస, తేనీరు, తాగునీరు అమ్మేవారు రోజుకు రూ.3 వేలు, ఆలుబిర్యానీ, ఇతర టిఫిన్లు అమ్మేవారు రూ.5 వేలు ఆయనకు చెల్లించాలి. ఈ స్టాల్కు కేవలం ఏడుగురు హాకర్లు అమ్ముకోవడానికి మాత్రమే స్టేషన్లో అనుమతి ఉంది.. అలాంటిది 120 మందితో అమ్మకాలు చేయిస్తున్నారని తెలుస్తోంది.
ఇతర స్టాల్స్ వారు కూడా నిబంధనలు పక్కన పెట్టి వారికి ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువ మంది హాకర్లతో అమ్మకాలు చేస్తున్నారు. వీరు ప్రతి రోజు రూ.వేలల్లో లీజుదారులకు డబ్బులు చెల్లించాల్సి రావడంలో ఎక్కువ ధరకు నాసిరకం అమ్మకాలు చేస్తున్నారు. సమోస రూ.10కి మాత్రమే అమ్మాలి.. రెండింటిని రూ.30కి విక్రయిస్తున్నారు. నీటి సీసా ధర రూ.15.. కానీ తప్పనిసరిగా రూ.20 తీసుకుంటున్నారు. ఇలా శీతల పానీయాలు, బిస్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?