వసంతోత్సవం వచ్చేసింది..!
వరంగల్ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వసంతోత్సవానికి వేళైంది. స్ప్రింగ్స్ప్రీ - 24ను ఏప్రిల్ 5 నుంచి 7 వరకు మూడురోజుల పాటు కోలాహలంగా జరిపేందుకు నిట్ యాజమాన్యం సిద్ధమైంది.
5 నుంచి 7 వరకు నిట్లో స్ప్రింగ్స్ప్రీ
ఈనాడు, వరంగల్, నిట్క్యాంపస్, న్యూస్టుడే
వరంగల్ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వసంతోత్సవానికి వేళైంది. స్ప్రింగ్స్ప్రీ - 24ను ఏప్రిల్ 5 నుంచి 7 వరకు మూడురోజుల పాటు కోలాహలంగా జరిపేందుకు నిట్ యాజమాన్యం సిద్ధమైంది.
యానిమేషన్ ఆధారంగా థీమ్.. రాసెంగన్
ఈసారి వేడుకల థీమ్గా విద్యార్థులు ‘రాసెంగన్’ను ఎంపిక చేశారు. జపనీస్ యానిమేషన్లోని ‘నరుటో’ అనే క్యారెక్టర్ వద్ద ఉండే మహిమగల ఓ బంతిని రాసెంగన్ అంటారు. ఇది ఎన్నో అద్భుతాలు సృష్టించగలదు. అలా ఈ వేడుకల్లో విద్యార్థులు కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతాలు చేస్తారని చెప్పేందుకు ఈ థీమ్ను ఎంపిక చేశారు.
బోలెడు ఈవెంట్లు
వేడుకల్లో మూడు రోజుల పాటు విద్యార్థులు అనేక ఈవెంట్లలో మునిగితేలనున్నారు.
- అల్యూర్ పేరుతో నిర్వహించే ఫ్యాషన్ ప్రదర్శనలో విద్యార్థినీ విద్యార్థులు ర్యాంప్ వాక్ చేస్తూ సరికొత్త హొయలతో మెరవనున్నారు.
- నిట్లో అనేక రకాల క్లబ్లు ఉన్నాయి. ఫిల్మ్ క్లబ్ వాళ్లు ‘పోస్టర్ రిక్రియేషన్’ పోటీలను నిర్వహించనున్నారు.
- క్విజ్ పోటీలను నిర్వహించేందుకు ‘క్యూ ఫ్యాక్టర్’ ద్వారా బోలెడు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడుతారు.
- ఈసారి సరికొత్తగా ‘రోర్ రీల్ రీవోల్ట్’ పోటీని నిర్వహిస్తున్నారు. డ్యాన్స్, డ్రామా క్లబ్ వారు నిర్వహించే ఇది ఆన్లైన్ పోటీ. ఇందులో మెప్పించే రీల్స్ చేసి విజేతలుగా నిలిచినవారికి రూ.10 వేల నగదు బహుమతి ఉంటుంది.
- ఫేస్ పెయింటింగ్స్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. కుండలు చేసే కళను విద్యార్థులు నేర్చుకుంటారు. రకరకాల హర్రర్ గేమ్స్ అలరిస్తాయి. అనేక రకాల వంటకాలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడంతో కావాల్సిన రుచులను ఆరగించవచ్చు.
గాయకులు హరిచరణ్, నకాశ్ ప్రదర్శనలు
ఈసారి వేడుకల్లో ప్రముఖ గాయకుల ప్రదర్శనలు అలరించనున్నాయి. వేడుకల మొదటి రోజే ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు హరిచరణ్ శేషాద్రి, ‘చౌరస్తా’ బ్యాండ్తో కలిసి తన పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఆయన తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో వేలాది పాటలు పాడారు. 6వ తేదీన ఏఆర్ రహమాన్తో కలిసి పనిచేసిన ప్రముఖ పాప్ గాయకుడు నకాశ్ అజీజ్ తన ప్రదర్శనతో అలరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం