logo

ఆశ.. నిరాశైన వేళ..

భారాస తరఫున వరంగల్‌ ఎంపీ టికెట్‌ తనకు ఇస్తారని.. సంబంధిత ప్రకటన వెలువడగానే మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలవాలనే ఆశతో వచ్చిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శుక్రవారం సాయంత్రం నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

Published : 13 Apr 2024 03:01 IST

సిద్దిపేట జిల్లా ములుగులో తాటికొండ రాజయ్య

ములుగు, న్యూస్‌టుడే: భారాస తరఫున వరంగల్‌ ఎంపీ టికెట్‌ తనకు ఇస్తారని.. సంబంధిత ప్రకటన వెలువడగానే మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలవాలనే ఆశతో వచ్చిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శుక్రవారం సాయంత్రం నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అభ్యర్థిగా హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ను ప్రకటించారని తెలియడంతో అప్పటివరకు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఎదురుచూస్తున్న రాజయ్య విలేకరులతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. గతంలో రాజయ్య భారాసను వీడారు. వరంగల్‌కు కాంగ్రెస్‌ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను అభ్యర్థిగా ప్రకటించినపుడు.. మళ్లీ రాజయ్య భారాసలో చేరుతారని, టికెట్‌ ఆయనకే కేటాయిస్తారనే ప్రచారం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు