ప్రమాదాల విస్తరణే..
జాతీయ రహదారి వెంట పలు గ్రామాల్లో సర్వీస్ రహదారులు పూర్తయిన వినియోగంలోకి రావడం లేదు. ఆయా గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారిపైనే నిలుపుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
న్యూస్టుడే, స్టేషన్ఘన్పూర్
ఘన్పూర్లో జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు వేయకుండా వదిలేసిన రోడ్డు..
జాతీయ రహదారి వెంట పలు గ్రామాల్లో సర్వీస్ రహదారులు పూర్తయిన వినియోగంలోకి రావడం లేదు. ఆయా గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారిపైనే నిలుపుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘన్పూర్లో వ్యాపారులు సర్వీస్ రోడ్లను ఆక్రమిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా యాదాద్రి-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులను 2015లో ప్రారంభించారు. ఇందు కోసం జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు-4 పథకం కింద రూ. 1,920 కోట్లు మంజూరు చేశారు. 2016 జూన్ 1న అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మంజూరైన నిధులతో రహదారి విస్తరణకు రూ. 897.03 కోట్లు కేటాయించగా, మిగతా 1,022.97 కోట్లు భూసేకరణ, గృహాలు కోల్పోయిన వారికి పరిహారం కోసం కేటాయించారు. ఎల్అండ్టీ సంస్థ పనులు చేపట్టింది. యాదాద్రి జిల్లాలో వంగపల్లి నుంచి వరంగల్ జిల్లా అరెపల్లి వరకు 99.10 కిలో మీటర్లు 30 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 1 వరకు పనులు పూర్తి చేయాలని గడువు ఇచ్చిన ఇప్పటి వరకు అనేక చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి.
నిబంధనల ప్రకారం..
రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్లు వేయాలి. సర్వీస్ రోడ్డుకు జాతీయ రహదారికి మధ్యలో ఇనుప కంచెతో రెయిలింగ్ ఏర్పాటు చేసి, హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో ప్రయాణికుల కోసం మినీ బస్ స్టేజీ ఏర్పాటు చేయాలి.
పెండింగ్ పనులు...
స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవాపూర్ నుంచి ఘన్పూర్ పరిధి ఇందరానగర్, చాగల్లు పరిధిలోని శివారెడ్డిపల్లె వద్ద జాతీయ రహదారికి రెండు వైపులా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్వీస్ రోడ్లు లేక అనేక ప్రమాదాలు జరిగాయి. రాఘవాపూర్ వద్ద సర్వీస్ రోడ్డు కోసం కంకర పోసి వదిలేశారు. రోడ్డు కోసం గ్రామంలో 100 ఫీట్లు తీసినప్పటికీ పనులు చేపట్టలేదు.
- ఘన్పూర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డు నిరుపయోగంగా ఉంది. బస్టాండ్ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీస్ రోడ్డు వేయాల్సి ఉన్న సబ్స్టేషన్ వరకు నిర్మించి వదిలేశారు.
- చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో రోడ్డు వేసినప్పటికీ హనుమకొండ, జనగామ వైపు సర్వీస్ రోడ్డు పక్కన డ్రైనేజీ పూర్తి చేయకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేయలేదు.
సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి
- బొడ్డు రమేష్ రాఘవాపూర్
జాతీయ రహదారిని అనుకొని ఉన్న గ్రామాల్లో వెంటనే సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి. అధికారులు స్పందించి తక్షణమే పనులు పూర్తి చేయాలి.
అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా..
- తోట రమేష్, సీపీఐ మండల కార్యదర్శి
అధికారుల నిర్లక్ష్యంతోనే పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్వీస్ రహదారులు ఉన్న బస్సులు జాతీయ రహదారిపైనే నిలుపుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే