పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు
మన ఊరు- మన బడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. భవిష్యత్తులో పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే ప్రాధాన్యం ఇవ్వనుంది.
వెంకటాపూర్ మండల కేంద్రంలో స్లాబు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్న బాలికల ప్రాథమిక పాఠశాల
ములుగు, న్యూస్టుడే: మన ఊరు- మన బడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. భవిష్యత్తులో పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. గత ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాల్లో దశల వారీగా పాఠశాలలను ఎంపిక చేసి పలు అభవృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో కొన్ని పనులు మాత్రమే పూర్తయ్యాయి. చాలా పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు చెల్లించడం లేదని పాఠశాల యాజమాన్య కమిటీలు, గుత్తేదారులు పనులు నిలిపివేశారు. పనులు నిలిచిపోయి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈ లోగా ప్రభుత్వం మారింది. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని శాశ్వతంగా తీసేసి స్వయం సహాయక సంఘాల మహిళలతో పాఠశాలలకు అమ్మ ఆదర్శ కమిటీలను వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు.
ఆగిపోయిన పనులూ పూర్తిచేసేలా..
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ములుగు జిల్లాకు రూ.10 కోట్లు కేటాయించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు కేటాయించారు. నూతనంగా చేపట్టనున్న అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టి ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేసేందుకు నిర్ణయించారు. మే చివరి వారంలోగా ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు పనులు గుర్తించారు.
ప్రాధాన్యాల వారీగా నిధులు
పాఠశాలల అభివృద్ధిలో ప్రధానంగా తాగునీరు, చిన్న చిన్న మరమ్మతులు, ఇప్పటికే నిర్మించి వినియోగంలో లేని టాయిలెట్లు, విద్యుత్తు సరఫరా, తదితర పనులు చేపట్టనున్నారు. ఇందులో 306 పాఠశాలల్లో తాగునీటి సరఫరాకు రూ. 3.06 కోట్లు, 130 పాఠశాలల్లో మైనర్ రిపేర్ల కోసం రూ.2.60 కోట్లు, ఇప్పటికే నిర్మాణం జరిగి నిరుపయోగంగా ఉన్న 761 టాయిలెట్ల మరమ్మతులకు రూ. 2.66 కోట్లు, 279 పాఠశాలల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు రూ.69.75 లక్షలు కేటాయించారు. వీటితో పాటు పట్టణ, గ్రామీణ పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిర్మాణం, మరమ్మతులకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్