ఉప్పు.. నాణ్యత లేకపోతే ముప్పు!
సాధారణంగా ఇళ్లల్లో వాడే ఉప్పులో అయోడిన్ పరిమాణం ఎంత ఉందనే విషయమై వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేయిస్తుంది. తీపి పదార్థాలు మినహా ఉప్పు వాడని వంటకాలు అనేవి ఉండవు.
న్యూస్టుడే, దేవరుప్పుల(జనగామ జిల్లా)
దేవరుప్పులలో అయోడిన్ పరీక్షలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు
సాధారణంగా ఇళ్లల్లో వాడే ఉప్పులో అయోడిన్ పరిమాణం ఎంత ఉందనే విషయమై వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేయిస్తుంది. తీపి పదార్థాలు మినహా ఉప్పు వాడని వంటకాలు అనేవి ఉండవు. కీలకమైన ఉప్పులో అనుచితాలు ఉన్నా అవసరమైన ధాతువులు తగ్గినా పెరిగినా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని.. నాణ్యత తెలుసుకునేందుకు నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాం పేరిట జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉప్పులో సాంద్రత తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది..
అయోడిన్ లోపిస్తే కలిగే రుగ్మతలు..
కాలానుగుణంగా వివిధ సంస్థలు ఉప్పును పొడిరూపంలో అందమైన ప్యాకింగ్లలో విక్రయిస్తున్నాయి. దానికే ప్రజలు అలవాటు పడి కొనుగోలు చేస్తున్నారు. కానీ అందులో అయోడిన్ సాంద్రత తెలుసుకోకపోతే ఎంతో ప్రమాదమని గ్రహించి పరీక్షలు ఏర్పాట్లు చేశారు. అయోడిన్ పరిమాణం 15 పీపీయం(పార్ట్స్ పర్ మిలియన్) ఉంటే బాగుందని వారు సూచిస్తున్నారు. దీనికన్నా తక్కువ మోతాదులో ఉంటే పలు సమస్యలు చుట్టుముడుతాయని చెబుతున్నారు. ఈ లోపంతో హైపోథైరాయిడిజం, థైరాక్సిన్ హార్మోన్ విడుదలలో హెచ్చుతగ్గులుంటాయి. దీంతో పిల్లలలో ఎదుగుదల లోపించి.. నిస్తేజంగా ఉంటారు. దృష్టి మాంద్యం ఏర్పడుతుంది. గర్భిణులకు గర్భస్రావం తదితర ఇబ్బందులు ఉంటాయి.
ఇప్పుడేం చేస్తున్నారంటే..
జిల్లా స్థాయిలో వైద్యశాఖ ఆధ్వర్వంలో ఆశా కార్తకర్తలకు తగు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించి కిట్లు అందించారు. రెండురకాల ద్రావకాలున్న సీసాలున్న కిట్ ద్వారా వంద టెస్టుల వరకు నిర్వహించవచ్చు. ఆశా కార్యకర్తలు వారి ఆధీనంలోని గృహాలను సందర్శించి మహిళలతో మాట్లాడి వినియోగించే ఉప్పును సేకరించి అందులో రెండు రకాల ద్రావణాలను మూడు నాలుగు చుక్కలు వేసి నిమిషం వ్యవధిలోనే ఫలితం తెలుసుకోవచ్చు. అది నీలం రంగులోకి మారితే వినియోగించడానికి అనువైన ఉప్పుగా పరిగణిస్తారు. వీధుల్లో లభించే గళ్ల ఉప్పు ప్రమాదకరమైనదని, వినియోగించడం మానుకోవాలని సూచిస్తున్నారు.
నాణ్యతగల ఉప్పునే వినియోగించాలి
-డాక్టర్ అనిల్ కుమార్, ప్రభుత్వ వైద్యుడు, దేవరుప్పుల
వంటలు రుచికరంగా ఉండాలంటే వాడే ఉప్పు నాణ్యత గురించి.. మనం సాధారణంగా పట్టించుకోం. కానీ వాడే క్రమంలో ఇలాంటి పరీక్షలు తప్పనిసరి. అందులోని ధాతువుల లోపంతో అనేక శారీరక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్