చెరువులు ఎండిపోయి.. ఆశలు ఆవిరై..!
జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరులేక నెర్రెలు బారుతున్నాయి.. భారీ వర్షాలతో నిండు కుండల్లా కనిపించే తటాకాలు గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలు కురవకపోవడంతో సామర్థ్యాల మేర నీరు చేరలేదు.
మహబూబాబాద్, న్యూస్టుడే: జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరులేక నెర్రెలు బారుతున్నాయి.. భారీ వర్షాలతో నిండు కుండల్లా కనిపించే తటాకాలు గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలు కురవకపోవడంతో సామర్థ్యాల మేర నీరు చేరలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం పలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితులను గమనించడంతో పాటు ఇతర కారణాలతో చాలా మంది చెరువుల కింద యాసంగి వేయలేదు. సాగు చేసిన వారికి సాగునీటి ఎద్దడి నెలకొంది.
జిల్లాలో 1594 చెరువులున్నాయి. ఆ జలాశయాల పరిధిలో సుమారు 95,460 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. జిల్లాలోని సుమారు 11 వందలకు పైగా ఉన్న చెరువులు వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు కురిస్తేనే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ఆ చెరువులు నిండి సాగునీటి అవసరాలు తీరుస్తాయి. ఈ ఏడాది నీరు ఎండిపోయి చాలా గ్రామాల్లో చెరువులు మైదానాలను తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ జలాలపై ఆధారపడిన సుమారు 400 చెరువుల్లోనూ కొన్ని నీరు లేక ఆ ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు సూర్యప్రతాపం పెరిగి 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండ వేడితో చెరువులు, కుంటల్లో ఉన్న ఆ కొంచెం నీరు కూడా ఆవిరైపోతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో చల్లదనం తగ్గి వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చెరువులు, కుంటల్లో నీరులేక పశువులు, జీవాలు కూడా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాయి.
మరికొన్ని ఇలా
- మహబూబాబాద్ పట్టణంలోని కంబాలచెరువులో నీటి మట్ట్టం 70 శాతం పడిపోయింది.
- కురవి మండలంలోని సింగాయకుంట పూర్తిగా ఎండిపోయింది. సుమారు 100 ఎకరాల్లో ఆయకట్టు ఉన్న ఈ కుంటలో యాసంగి పంటకు సాగునీరు లేక ఇబ్బంది పడ్డారు.
- కురవి మండలంలోని అయ్యగారిపల్లి పెద్ద చెరువు 80 శాతం మేరకు ఎండిపోయింది. ఆ చెరువు కింద ఉన్న వ్యవసాయ బావుల్లో కూడా భూగర్భ జలాలు పడిపోయాయి.
- నెల్లికుదురు మండలంలోని మదనతుర్తి పెద్ద చెరువు పూర్తిగా అడుగంటి పోయింది.
- మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మున్నేరు, ఆకేరు వాగు పూర్తిగా అడుగంటి పరివాహక ప్రాంత రైతులకు సాగునీటికి పాట్లు తప్పడం లేదు.
పెద్దచెరువులో దిగువకు..
బయ్యారం: సుమారు 11 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న బయ్యారం పెద్దచెరువు గతంలో ఎన్నడూ లేనంతగా నీటి మట్టం ఈ ఏడాది పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్దచెరువులో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో 2.5 అడుగులకు చేరుకుంది. గతేడాది మే నెలలో సుమారు 6 అడుగుల వరకు నీరు నిలువ ఉంది. 2022లో 13 అడుగుల నీటి మట్టం ఉండటంతో ఈ చెరువు కింద సాగు చేసిన సుమారు 2వేల ఎకరాలకు యాసంగి సాగుకు నీరందించారు. ఈ ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలు లేకపోవడం, నీటిని కొందరు అక్రమంగా విడుదల చేసి వృధా చేయడం వల్ల నేడు పూర్తిస్థాయిలో నీటిమట్టం తగ్గిపోయింది.
అడుగంటిన నీరు...
మహబూబాబాద్ రూరల్: అమనగల్ పెద్ద చెరువులో నీరు అడుగంటింది. 15.89 ఎంసీఎఫ్టీ సామర్థ్యంగల చెరువు పరిధిలో సుమారు 153 ఎకరాల ఆయకట్టు ఉంది. నీరు పూర్తిగా చివరి దశకు రావడంతో రైతులు వ్యసాయ బావులపైనే ఆధారపడాల్సి వస్తోంది. చెరువు శిఖంలో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
కందకాల్లోనే
కోడి చెరువులో
గూడూరు: మండల కేంద్రంలో సుమారు 131 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోడి చెరువు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. వానాకాలం వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ప్రస్తుతం చెరువు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ చెరువు కింద 300 ఎకరాలు ఆయకట్టు ఉంది. నీటి వనరు లేకపోవడంతో ఈ యాసంగి సీజన్లో 30 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. చెరువుల్లో నీరు తగ్గిపోవడం వల్ల పరిసర వ్యవసాయ బావులు, ఇళ్లలోని బోరు బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి