రహదారి ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రహదారి ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇద్దరు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఈ హృదయ విదారక ఘటన ఆదివారం జరిగింది.
రెండు కుటుంబాల్లో విషాదం
సంఘటనాస్థలిలో ప్రజలు
డోర్నకల్, న్యూస్టుడే: రహదారి ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇద్దరు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఈ హృదయ విదారక ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుతండాకి చెందిన బానోతు మోహన్ (47) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెంలో తమ బంధువుల ఇంట్లో జరిగే దైవకార్యక్రమానికి భార్య పార్వతి, కుమార్తె అనూషతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మరో నాలుగు కి.మీ., వెళితే గమ్యం చేరేవారు. మరోవైపు డోర్నకల్ మండలం వెన్నారం గ్రామశివారు రామకుంటతండాకు చెందిన తేజావతు జస్వంత్ (23) తన పెద్దనాన్న కూతురి వివాహ రిసెప్షన్కు వెళ్లేందుకు డోర్నకల్లో నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ద్విచక్రవాహనంపై సమీప బంధువు మంగీలాల్తో కలిసి వస్తున్నారు. డోర్నకల్లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో బానోతు మోహన్ ద్విచక్రవాహనాన్ని వీరు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బానోతు మోహన్ (47), తేజావతు జస్వంత్ (23) మృతి చెందారు. మంగీలాల్, పార్వతి, అనూష గాయపడ్డారు. వీరిలో మంగీలాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు ద్విచక్రవాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. అదే సమయంలో అటు వైపునకు సీఆర్పీఎఫ్ బలగాలతో వస్తున్న ఎస్సై తిరుపతి సహాయక చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ సర్వర్ పాష ముగ్గురికి సీపీఆర్ చేశారు. 108 వాహనంలో మహబూబాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకుని బర్లగూడెం, ఆరెకోడుతండా, రామకుంటతండాలో విషాదం అలుముకుంది. మృతదేహాలకు మహబూబాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. డోర్నకల్ సీఐ ఉపేందర్రావు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎదురుగా వచ్చిన వాహనఛోదకుడి నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని మృతుడు మోహన్ భార్య పార్వతి డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆ మార్గంలోనే వెళ్లి..: ఈ ప్రమాదం జరిగిన మార్గం గుండానే తేజావతు జస్వంత్ పెద్దనాన్న కూతురి వివాహ రిసెప్షన్కు ప్రమాదస్థలిని దాటి వెళ్లారే తప్ప అక్కడ బాధితులు తమ సమీప బంధువులేనని గమనించలేకపోయారు. తీరా రామకుంటతండాకు చేరినవారంతా ఈ విషయం తెలుసుకొని బోరున విలపిస్తూ పరిచయస్థులకు ఫోన్ చేసి ఆరా తీశారు. మానుకోట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసి కొందరు ఆక్కడికి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట