అమృత్ భారత్ నిధులతో కొత్త హంగులు
దేశంలోని పలు రైల్వేస్టేషన్లను అత్యంత సుందరీకరణతో అధునాతన వసతులు చేపట్టడానికి గాను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమృత్భారత్ రైల్వేస్టేషన్ పథకం మంజూరు చేసింది.
జనగామ రైల్వేస్టేషన్
జనగామ టౌన్, న్యూస్టుడే: దేశంలోని పలు రైల్వేస్టేషన్లను అత్యంత సుందరీకరణతో అధునాతన వసతులు చేపట్టడానికి గాను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమృత్భారత్ రైల్వేస్టేషన్ పథకం మంజూరు చేసింది. ఈ పథకంలో దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో అధునాతన రీతిలో అభివృద్ధి పనులును రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందులో భాగంగా జనగామ రైల్వేస్టేషన్కు రూ.24 కోట్లను మంజూరు చేసింది. ఏడు నెలల క్రితం అప్పటి భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్టేషన్లో ఈ పనులను ప్రారంభించారు. రెండు దశల్లో పనులు పూర్తి చేయడానికి రైల్వే శాఖ సివిల్ విభాగం వారు ప్రణాళికను రూపొందించి పనులను చేపట్టారు. ఇవి పూర్తయితే స్టేషన్ కొత్త హంగులతో అధునాతనంగా మారనుంది.
అభివృద్ధి పనుల వివరాలు
దశాబ్దాలుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో సరైన వసతులు కరవయ్యాయి. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకంలో మొదటి దశ పనుల్లో భాగంగా మొదటి ప్లాట్ఫారంపైన ఇప్పుడున్న బుకింగ్ కౌంటర్ను మరోచోట నిర్మించనున్నారు. స్టేషన్ మేనేజర్ కార్యాలయాన్ని, రైల్వే పోలీస్ స్టేషన్ను కొత్తగా నిర్మించనున్నారు. ప్రయాణికులు వేచి ఉండే వెయిటింగ్ గదుల విభాగాన్ని కూడా అధునాతనంగా నిర్మించనున్నారు. రెండు ప్లాట్ఫారాలపై అదనంగా రేకుల షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్ పట్టణం నడిబొడ్డున ఉండటంతో ప్రజలు రాకపోకలకు పట్టాలు దాటుతున్నారు. పట్టణ ప్రజలతో పాటు ప్రయాణికులు కూడా స్టేషన్ బయట మొదటి ప్లాట్ ఫారం నుంచి రెండో ప్లాట్ ఫారం బయటకు వెళ్లడానికి కొత్తగా వంతెన నిర్మించనున్నారు. స్టేషన్ ఎదురుగా పచ్చని చెట్లు, గడ్డి ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేయనున్నారు. నెల రోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ఏడీఆర్ఎం పనులను పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం రెండో ప్లాట్ఫాం వద్ద ఉన్న వ్యాగన్ పాయింట్ సమీపంలో మూడో ప్లాట్ఫాం పనులను కూడా రెండో దశలో చేపట్టనున్నారు. భవిష్యత్లో సికింద్రాబాద్ నుంచి భువనగిరి, ఆలేరు, జనగామ మీదుగా ఎంఎంటీఎస్ రైళ్లను పొడగించడానికి గాను మూడో లైన్ ఏర్పాటు ప్రతిపాదనలో ఉంది.
రైళ్ల హాల్టింగ్ మాటేమిటి..?
అభివృద్ధి పనులు జరుగుతున్నా కూడా ఎంతో కాలంగా కోరుతున్న పలు ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నా కూడా ఇవ్వడం లేదని ఈ ప్రాంత ప్రయాణికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా మారడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడలిగా ఉంటోంది. ఎంతో కాలం నుంచి జనగామ మీదుగా హైదరాబాద్కు రైళ్లల్లో అప్ అండ్ డౌన్ చేస్తూ వేలాది మంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వేగంగా అభివృద్ధి జరుగుతున్న జనగామ ప్రాంత వ్యాపార వర్గాలకు కూడా రైళ్ల హాల్టింగ్ ఎంతో ఉపయోగపడనుంది. జనగామలో శాతవాహన, చార్మినార్, సింహపురి తదితర ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ