అమ్మ సన్నిధిలో సన్మానమంటే పుణ్యఫలమే
‘ఎన్నో ఆలయాలు, వివిధ రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు చూశా, అయితే మావుళ్లమ్మను చూసిన సమయంలో నాకు కలిగిన తృప్తి, ఆనందం ఎక్కడా కలగలేదు’ అని సినీ నటి ఆమని అన్నారు.
సినీనటి ఆమని
ఆమనిని సన్మానించి జ్ఞాపికను అందిస్తున్న సభ్యులు
భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్టుడే: ‘ఎన్నో ఆలయాలు, వివిధ రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు చూశా, అయితే మావుళ్లమ్మను చూసిన సమయంలో నాకు కలిగిన తృప్తి, ఆనందం ఎక్కడా కలగలేదు’ అని సినీ నటి ఆమని అన్నారు. మావుళ్లమ్మ ఆలయ 59వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆమెకు సువర్ణ కంఠాభరణంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో షూటింగ్ సమయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లానన్నారు. ఆనాడు తాను మొక్కుకున్న కోరిక ఇప్పుడు నేరవేరందని ఆనందం వ్యక్తం చేశారు. సినీరంగంలో మొదటి అవార్డు అందుకున్న సమయంలో పొందిన సంతోషం ఇప్పుడు మరోసారి కలిగిందన్నారు. అమ్మ అందరినీ చల్లగా చూడాలని అంటూ అభివాదం చేశారు. ముందుగా జరిగిన సన్మాన సభలో తితిదే మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, తెదేపా రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, పండ్లవర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీరమహంకాళిరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, వర్తక సంఘం అధ్యక్షుడు తుటారపు ఏడుకొండలు, ఆలయ సహాయ కమిషన్ వై.భద్రాజీ, ధర్మకర్తల మండలి ఛైర్మన్ ఎం.నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..