Murder: అనుమానం పెనుభూతమై!.. వివాహిత దారుణహత్య
ప్రశాంత వాతావరణానికి నెలవైన పెనుగొండలో వివాహిత హత్య కలకలం రేపింది. పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళగా దర్యాప్తు చేపట్టినా కొద్ది సేపటికే ఆమె వివరాలు తెలుసుకున్నారు.
పెనుగొండ, మార్టేరు, న్యూస్టుడే: ప్రశాంత వాతావరణానికి నెలవైన పెనుగొండలో వివాహిత హత్య కలకలం రేపింది. పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళగా దర్యాప్తు చేపట్టినా కొద్ది సేపటికే ఆమె వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెనుగొండ - దేవ ఆర్అండ్బీ మార్గంలోని అడ్డపుంత పంట కాలువలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని పరిశీలించగా మృతదేహం బోర్లా పడి ఉండటం, దుస్తులు చిరిగి ఉండటంతోపాటు గాయాలు ఉండటంతో వెంటనే అప్రమత్తమయ్యారు. మృతదేహాన్ని గట్టుకు చేర్చి వివాహితగా గుర్తించి, ఎవరనే దానిపై ఆరా తీశారు.
పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామానికి చెందిన నందిని(25)గా గుర్తించారు. పదునైన ఆయుధంతో ఆమె వీపు, ఎడమ జబ్బ, ఛాతిపై పొడిచి హత్యచేసిన అనంతరం పంట పొలాల మధ్య ఉన్న కాలువలో పడేసినట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొంత పెనుగులాట జరగడంతో ఆమె వీపుపై ఉన్న దుస్తులు చిరిగిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఎస్పీ యు.రవిప్రకాశ్, నరసాపురం డీఎస్పీ రవిమనోహరచారి ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. వీఆర్వో లక్కవరపు ప్రసాద్ ఫిర్యాదు మేరకు సీఐ జీవీవీ.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలంలో తనిఖీలు చేశారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని..
నందిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో తల్లి వద్ద ఉంటున్న సమయంలో కొఠాలపర్రు గ్రామానికి చెందిన చివటం రాంప్రసాద్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వీరు 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి 18 నెలల బాబు దేవాంత్ ఉన్నాడు. ప్రస్తుతం పెనుగొండలో నివసిస్తున్న రాంప్రసాద్ పెయింటింగ్ పని చేస్తుండగా నందిని గృహణి. కుమారై హత్య సమాచారం తెలుసుకున్న తల్లితోపాటు బంధువులంతా స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకుని బోరున విలపించారు.
గౌరీపట్నం వెళ్దామని చెప్పి..
సోమవారం రాత్రి గౌరీపట్నంలోని తల్లి వద్దకు వెళ్దామని చెప్పి నందినిని బయటకు తీసుకొచ్చిన భర్త రాంప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు పడుతున్నారు. సోమవారం ఉదయం తణుకు వచ్చిన అత్తగారిని కలిసిన రాంప్రసాద్ తన భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పగా ఆమె సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. ఈలోగా క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఈ హత్య ఉదంతంలో భర్తతోపాటు మరెవరన్నా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త రాంప్రసాద్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.