మాటలు తప్ప.. ఆటల్లేవ్!
‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరిట ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా సర్కారు గత అయిదేళ్లలో క్రీడాకారుల కోసం చేసిందేమీ లేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలకు నిధులు ఆపేసి నిర్వీర్యం చేసింది.
క్రీడా సదుపాయాలకు నిధులు ఆపేసిన వైకాపా సర్కారు
భీమవరం పట్టణం, వీరవాసరం, న్యూస్టుడే: ‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరిట ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా సర్కారు గత అయిదేళ్లలో క్రీడాకారుల కోసం చేసిందేమీ లేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలకు నిధులు ఆపేసి నిర్వీర్యం చేసింది. 40 శాతానికి పైగా ఉన్న యువత క్రీడా సాధనకు అవసరమయ్యే సదుపాయాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియంల నిర్మాణాలకు గతంలో నిధులు కేటాయించారు. భీమవరం 4వ వార్డులో, వీరవాసరంలో నిర్మాణాలు ప్రారంభించగా వైకాపా అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడ పనులు నిలిపేశారు. క్రీడా సాధనకు తగిన వసతులు కల్పించకుండా జాతీయ, అంతర్జాతీయంగా క్రికెట్, అథ్లెట్లను రాష్ట్రం నుంచి తయారు చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పడం విడ్డూరమని క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. ఆడుదాం..ఆంధ్రా పేరుతో అరకొర వసతులు, పర్యవేక్షకులు లేకుండానే మొక్కుబడిగా పోటీలు నిర్వహించి పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆరోపిస్తున్నారు.
భీమవరం నర్సయ్య అగ్రహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గత పాలక మండల హయాంలో టెన్నిస్ కోర్టు నిర్మాణాన్ని చేపట్టి కొంత మేర పూర్తిచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులు జరగలేదు. అధునాతన భవనాల మధ్య ఇది నిరుపయోగంగా మిగిలింది.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే యోచనతో తెదేపా ప్రభుత్వ హయాంలో వీరవాసరం ఎంఆర్కే జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన ఇండోర్ స్టేడియం ఇది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
నైపుణ్యాలకు దూరం
క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం పూర్తయి ఉంటే వాలీబాల్, షటిల్, కబడ్డీ వంటి క్రీడల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగపడేవి. నేను ఒక ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. నిత్యం వ్యాయామం చేసే అలవాటు ఉంది. నాతో పాటు చుట్టుపక్కల యువతకు క్రీడల్లో శిక్షణ ఇస్తుంటా. క్రీడా వికాస కేంద్రం నిర్మాణం పూర్తయి ఉంటే గ్రామీణ యువతకు మెరుగైన నైపుణ్యాలు వచ్చేవి.
పాలా కృష్ణ, వీరవాసరం
అయిదేళ్లుగా ఎదురుచూపులు
క్రీడా వికాస కేంద్రాలు యువతకు ఎంతో అవసరం. మా ప్రాంతంలో ఇండోర్ స్టేడియం ఎప్పుడు పూర్తవుతుందోనని అయిదేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నా. కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించాలంటే తగిన వసతులుండాలి. నేను సాధన చేయాలనుకున్న సమయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి కాలేదు. భావి తరానికైనా ఉపయోగపడేలా నిర్మాణాలు పూర్తి చేయాలి.
దగ్గు శ్రీధర్, వీరవాసరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..