అడవి తల్లిపై గొడ్డలి వేటు
అడవి తల్లిపై గొడ్డలి వేటు పడుతోంది. వందల ఎకరాల్లో అక్రమార్కులు అడవిని యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. కుక్కునూరు మండలం కొండపల్లి, ముత్యాలంపాడు మధ్య వాగుల చెంతన ఉన్న అడవి పెద్దల దాహానికి బలవుతోంది.
కొండపల్లి- ముత్యాలంపాడు మధ్య చెట్ల నరికివేత
కుక్కునూరు, న్యూస్టుడే: అడవి తల్లిపై గొడ్డలి వేటు పడుతోంది. వందల ఎకరాల్లో అక్రమార్కులు అడవిని యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. కుక్కునూరు మండలం కొండపల్లి, ముత్యాలంపాడు మధ్య వాగుల చెంతన ఉన్న అడవి పెద్దల దాహానికి బలవుతోంది. వాగుల్లో మార్చి వరకు నీరు ప్రవహిస్తుంటుంది. ఆయిల్ ఇంజిన్ల ద్వారా ఆ భూములకు సాగునీరందించే అవకాశం ఉంది. నాణ్యమైన సాగుభూమి, పక్కనే నీటి వసతి ఉండటంతో ఈ భూములపై ఆక్రమణదారుల కళ్లు పడ్డాయి. అంతే తెరపైన ఆదివాసీలను పెట్టి.. తెరవెనుక వారు ఉంటూ ఈ భాగోతం నడిపిస్తున్నారు.
ప్రత్తి పంట సాగుకు
ఇప్పటికే వందల ఎకరాల్లో నరికివేత జరగ్గా.. ఆ వనమేథం ఇంకా కొనసాగుతూనే ఉంది. అడవిని నరుకుతున్న వ్యక్తులు చత్తీస్గఢ్, ఒడిశా నుంచి వచ్చిన ఆదివాసీలు కాగా.. వెనుక స్థానిక పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొండపల్లి, కోయగూడెం, గుండంబోరు, ఎర్రబోరు, ముత్యాలంపాడు గ్రామాలకు చెందిన పశువులు ఆ అడవిలో మేతకు వెళ్లేవని.. ఇప్పుడు దానిని నరికి వేస్తుండటంతో వాటికి మేత దొరకక ఆకలితో అలమటిస్తున్నాయని వాపోతున్నారు. అక్రమార్కులు అటవీ అధికారులను తమ దారికి తెచ్చుకున్నట్లు స్థానికుల ఆరోపణ. ఇప్పటికే అడవిలో చాలా భాగం ఆక్రమణకు గురికాగా.. అక్కడక్కడా మిగిలినదాన్ని కూడా వదలడం లేదు. పత్తి పంటకు ఈ భూములు అనుకూలంగా ఉండటం, మార్కెట్లో మంచిధర పలుకుతుండటంతో అక్రమార్కులు అటవీ భూములపై దృష్టి సారించారు. ఇప్పటికైనా ఆ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే మిగిలిన అడవి సైతం గొడ్డలివేటుకు బలయ్యే అవకాశం ఉంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
‘కొండపల్లి, ముత్యాలంపాడు మధ్య ఉన్న అడవిలో పరిస్థితిని తెలుసుకునేందుకు వెంటనే సిబ్బందిని పంపిస్తా. ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతంలో మళ్లీ అడవులు పెంచేందుకు చర్యలు తీసుకుంటా. ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టకుండా వారిపై కేసులు నమోదు చేస్తాం’ అని అమరవరం రేంజి అధికారి శ్రీనివాస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్