పేదలకు కిలో కందిపప్పు ‘ఇవ్వలేవా జగన్’?
జగన్ ప్రభుత్వం పేదలకు కందిపప్పు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా పంపిణీ చేయాల్సింది కొండంత ఉంటే..సరఫరా గోరంత కూడా ఉండటం లేదు. ఫలితంగా రాయితీతో రూ.67కి వచ్చేది మార్కెట్లో రూ.160కి కొనుగోలు చేస్తున్నారు.
ఏడాదిన్నరగా 14,683 టన్నులు ఎగవేత
లబ్ధిదారులపై రూ.125.9 కోట్ల భారం
ఈనాడు, ఏలూరు, న్యూస్టుడే ఏలూరు కలెక్టరేట్, భీమవరం అర్బన్: జగన్ ప్రభుత్వం పేదలకు కందిపప్పు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా పంపిణీ చేయాల్సింది కొండంత ఉంటే..సరఫరా గోరంత కూడా ఉండటం లేదు. ఫలితంగా రాయితీతో రూ.67కి వచ్చేది మార్కెట్లో రూ.160కి కొనుగోలు చేస్తున్నారు. అయిదేళ్లుగా విసిగిపోయిన ప్రజలు ‘కందిపప్పు కూడా ఇవ్వలేవా జగన్’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు ఆ కిలోకీ దిక్కులేదు..
2019 వరకు రాయితీపై కిలో రూ.40 చొప్పున కార్డుకు నెలకు రెండు కిలోలు ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర రూ.67కి పెంచింది. రెండుకు బదులు కిలోకు కుదించారు. ఇప్పుడు ఆ కిలోకి కూడా దిక్కులేదు. సరఫరా లేకపోవటంతో బయట కొనుగోలు చేయాల్సి ఉంది. రూ.93 అధికంగా ఖర్చు చేయాల్సి ఉంది.
ప్రతిపక్షంలో ఆర్బాటం ఎక్కువ:
2014 ముందు రేషన్ దుకాణానికి వెళ్తే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, కిరోసిన్, పామాయిల్, గోధుమ పిండి, కారం, పసుపు, ఉప్పు తదితర తొమ్మిది రకాల వస్తువులు లభించేవి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రేషన్ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప ఏమైనా దొరుకుతుందా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి’’
ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్రెడ్డి అన్న మాటలివి
అధికారం వచ్చాక ఇదీ పరిస్థితి
ప్రతిపక్షంలో ఉండి జగన్ చెప్పినవన్నీ మర్చిపోయారు. తొమ్మిది రకాల సరకులిచ్చే మాట దేవుడెరుగు. 2019లో ఆయన అధికారంలోకి వచ్చాక..అత్యవసరమైన కందిపప్పు పంపిణీలో కూడా అడ్డంగా కోత పెట్టారు. ప్రతి నెలా 50-70 శాతం కార్డుదారులకు అందని ద్రాక్షగా మార్చేశారు. రూ.125.9 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి రూ.234.9 కోట్ల సొమ్ము మిగుల్చుకున్నారు.
రూ.234.9 కోట్లు మిగుల్చుకున్నారు:
ఉమ్మడి జిల్లాలో 11.87 లక్షల మంది కార్డుదారులున్నారు. 755 ఎండీయూ వాహనాల ద్వారా నెలకు 1181 టన్నుల కందిపప్పు అవసరముంది. 2023 జనవరి నుంచి 2024 ఏప్రిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగానే సరఫరా చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్డుదారులకు 16 నెలల్లో కార్డుదారులందరికీ కలిపి 18,716 టన్నులు కిలో రూ.67 చొప్పున రాయితీపై అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు 4033 టన్నులు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.160-180 వరకు పలుకుతోంది. కందిపప్పు సరఫరాను పూర్తిగా తగ్గించేసింది. ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లింపులు చేయకపోవటంతోనే సరఫరా ఇంత హీనంగా ఉందని తెలుస్తోంది. మొత్తం మీద గత ఏడాదిన్నరగా 14,683 టన్నులు పంపిణీ చేయలేదు. ఇలా ప్రభుత్వం రూ.234.9 కోట్లు మిగుల్చుకుంది.
బయట కొనుక్కోవాల్సిందే
నిబంధనల ప్రకారం కార్డుదారుకు కిలో చొప్పున పంపిణీ చేస్తారు. ఉమ్మడి జిల్లాలో 11.98 లక్షల మంది కార్డుదారులుండగా.. నెలకు మొత్తం 1198 టన్నులు అవసరం. ప్రభుత్వం కిలో రూ.67కే సరఫరా చేసేది. బహిరంగ మార్కెట్లో రూ.160 వరకు పలుకుతోంది. ఈ లెక్కన రెండు జిల్లాల లబ్ధిదారులపై ఏడాదిన్నరగా 125.9 కోట్ల భారం పడుతోంది.
కందిపప్పే ఇవ్వడం లేదు:
ఏలూరు శ్రీరామ్నగర్లో ఈ నెల మొదటి వారంలో ఎండీయూ వాహనం వచ్చింది. రేషన్ తీసుకునేందుకు కార్డుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. కందిపప్పు ఉందా అని కార్డుదారులు అడిగితే రావటం లేదండి బయట కొనుక్కోండి అని చెప్పారు. ఉగాది సమయంలోనూ ఇవ్వరా అంటూ నాగలక్ష్మి, శిరీష, రవళి, తదితర గృహిణులు పెదవి విరిచారు. ఇంటింటికీ వెళ్లి రేషన్ ఇవ్వాల్సి ఉన్నా వీధి చివర పెట్టి అందరినీ అక్కడికే రావాలంటున్నారని వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం