గోరంత ఇచ్చి గొప్పలా..
అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తానంటూ జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు.
లాక్కున్నదే ఎక్కువంటున్న వాహనమిత్ర లబ్ధిదారులు
పైగా కొర్రీలతో కోత
భీమవరం అర్బన్, ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే: అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తానంటూ జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. దీనిగురించి ఎంతో ఆర్భాటంగా చెప్పి.. ఆ తర్వాత ఆంక్షలు విధించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోపక్క వాహనాలకు విధించే పన్నులు నాలుగు రెట్లు పెంచేశారు. ప్రభుత్వం ఇస్తున్నదాని కంటే పన్నుల రూపంలో లాగుతున్నదే ఎక్కువగా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల పేరుతో కొర్రీ!
ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 30 వేల ఆటోలు ఉండగా.. 40 వేల వరకు ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్లు ఉన్నట్లు అంచనా. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 2019 నుంచి 2023 వరకు అయిదు విడతలుగా రూ.10 వేల చొప్పున డ్రైవర్లకు అందించారు. కుటుంబంలో మరో వ్యక్తికి కారు, మరేదైనా వాహనం ఉన్నా, వాహన రిజిస్ట్రేషన్, యజమానికి చోదక అనుమతి పత్రం లేకపోయినా, విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటినా ఇలా.. పలు నిబంధనలతో లబ్ధిదారుల జాబితా కుదించారు.
ఏటా రూ.28 వేల భారం
జిల్లాలో ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ.97.75 ఉండగా..పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం రూ.87కు విక్రయిస్తున్నారు. అంటే లీటరుకు అదనంగా రూ.10కి పైగా వసూలు చేస్తున్నారు. పెట్రోల్ ధర కూడా రూ.9 ఎక్కువ. ఒక ఆటో డ్రైవర్ రోజుకు సగటున 5 లీటర్లు కొట్టించినా నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేల అదనపు భారం పడుతోంది. కానీ వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో ఇచ్చేది రూ.10 వేలు మాత్రమే. అది కూడా కొంతమందికే. అంటే జగనన్న ప్రభుత్వం ప్రతి డ్రైవర్ నుంచి అదనంగా రూ.8 వేలు లాగుతోంది. దీనికితోడు గతుకుల రోడ్లపై వాహనాలు మరమ్మతులకు గురవుతుండటంతో నెలకు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. మొత్తంగా పెరిగిన ఇంధన ధరలు, పన్నులతో ఒక్కో ఆటో, ట్యాక్సీ డ్రైవర్పై ఏడాదికి రూ.28 వేల చొప్పున భారం పడుతోంది.
నాలుగు రెట్లు అదనంగా
వాహనమిత్ర పథకంలో ఏడాదికి రూ.10 వేలు చెల్లిస్తున్నారు. అంతే మొత్తంలో ఏటా వాహన బీమా, కాలుష్యం వంటి వాటికి కట్టాల్సి వస్తోంది. రహదారులు దారుణంగా ఉండటంతో తరచూ ఇంజిన్, పంపింగ్ బెడ్లు మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని వేయించడానికి కనీసం రూ.4 వేలు వెచ్చించాలి. వీటన్నింటికీ కలిపి ఏడాదికి రూ.40 వేలకు పైగా ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చినదాని కంటే నాలుగురెట్లు అదనంగా అవుతోంది.
బాతు నరేష్, ఆటోడ్రైవర్, భీమవరం
నామమాత్రమే..
అర్హత ఉన్నా పథకంలో గత ఏడాది నాకు రూ.10 వేలు ఇవ్వలేదు. ఆటో నిర్వహణ రోజురోజుకూ భారంగా మారుతోంది. కట్టాల్సిన పన్నులు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. ఆటో, కుటుంబ నిర్వహణ కలిసి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం చేస్తున్న సాయం నామమాత్రంగా ఉంది.
కేతా శ్రీనివాసు, ఆటోడ్రైవర్, భీమవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?