ఇంటర్ ఫలితాల్లో 9వ స్థానం
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గతేడాది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా ఈసారి విభజిత జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరిగాయి.
ద్వితీయ సంవత్సరంలో 80 శాతం ఉత్తీర్ణత
భీమవరం పట్టణం, న్యూస్టుడే: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గతేడాది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా ఈసారి విభజిత జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరిగాయి. ప్రథమ సంవత్సరంలో 69, రెండో ఏడాదిలో 80 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆర్ఐవో కె.చంద్రశేఖర్బాబు తెలిపారు. నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్ పేరిట ఇంటర్ తరగతులు ప్రారంభించారు. మొత్తం 15 కళాశాలల నుంచి ప్రథమ సంవత్సర విద్యార్థులు 227 మంది పరీక్షలకు హాజరుకాగా 63 మంది, ద్వితీయ ఏడాది నుంచి 114 మందికి గాను 31 మంది ఉత్తీర్ణులయ్యారు. ః ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 14 ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో 876 మందికి 351 మంది, రెండో ఏడాదిలో 694కు 460 మంది ఉత్తీర్ణత సాధించారు.
అధ్యాపకుల కొరతతో గాడితప్పి..
ఈనాడు, ఏలూరు: ప్రభుత్వ విద్యను కొత్త పుంతలు తొక్కిస్తామంటూ సీఎం జగన్ మొదలు వైకాపా నాయకులు వరకు ప్రసంగాల్లో ఊదరకొట్టారు. తీరా శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మాత్రం ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం దారుణంగా దిగజారిపోయింది. అధ్యాపకుల కొరత, ల్యాబుల్లో ఇబ్బందులు తదితర సమస్యలతో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోనట్లు తెలుస్తోంది.ఉమ్మడి జిల్లాలో రెగ్యులర్ అధ్యాపకులు పోస్టులు 250కి పైగా ఖాళీగా ఉండటంతో చాలా కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులతో నడిపించేస్తున్నారు. ఫలితాలు బాగా పడిపోయాయి. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో 2728కి 1458 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 53.45 మాత్రమే. పశ్చిమలోనూ ఇదే స్థాయిలో ఫలితాలున్నాయి.
సదుపాయాల్లేక ఇక్కట్లు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రయోగశాలల సమస్య వేధిస్తోంది. చాలా విద్యా సంస్థల్లో అసలు లేనే లేవు. కొన్ని చోట్ల ఉన్నా పరికరాల కొరత ఉంది. ఉన్న అరకొర పరికరాలతో ప్రయోగాలు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. కళాశాలల్లో పర్యవేక్షణ సవ్యంగా లేదు. విద్యార్థుల హాజరును పట్టించుకునే పరిస్థితి లేదు. మూలాల్లో మార్పులు చేయనంత కాలం ఇదే ఫలితాలు పునరావృతమవుతాయని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిన రెగ్యులర్ అధ్యాపకులు 450
ప్రస్తుతం ఉన్నవారు 190 మంది
విధుల్లో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు 210
ఖాళీలు 50
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి