జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
అనాథగా ఎర్రకాలువ ప్రాజెక్టు
నిర్వహణను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.. ప్రస్తుతం 14 వేలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నారు. కేవలం డీఈ, ఏఈ, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఏడుగురు లస్కర్లతో ఇంత పెద్ద ప్రాజెక్టును నెట్టుకొస్తున్నారు. 83.50 మీటర్ల గరిష్ఠ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 4.428 టీ©ఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. కానీ భద్రత లేని కారణంగా ప్రస్తుతం 82.63 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. ఈ కారణంగా 2.26 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటోంది.
కుడి, ఎడమ ప్రధాన కాలువలకు లైనింగ్ లేదు. తూడు పెరిగింది. ఎక్కడికక్కడ గట్లకు గండ్లు పడ్డాయి. షట్టర్లు కొట్టుకుపోయాయి. గేట్లు తుప్పుపట్టాయి. సుమారు 60 ఓటీ స్లూయిజ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. క్రాస్ రెగ్యులేటర్లు బాగోలేక ఉప కాలువల్లో నీరుపారక శివారు భూములకు చేరడం లేదు. కాలువలు, ఉపకాలువల తవ్వకాలు అసంపూర్తి మిగిలాయి.
ఎర్రకాలువ ఆధునికీకరణకు రూ.25 కోట్లు కేటాయించగా ఏ పనీ జరగలేదు. కుడి ప్రధాన కాలువపై ఉప కాలువల నిర్మాణ పనులకు ఏడు పర్యాయాలు టెండర్లు పిలవగా.. గత పనుల బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో గుత్తేదారులెవరూ స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో నీటి నిర్వహణ చేయడానికి జలవనరుల శాఖ అష్టకష్టాలు పడుతోంది.
ఎడమ ప్రధాన కాలువ పరిధిలో అదనంగా 3వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బయనేరుపై నిర్మించిన అక్విడక్టు ఆరేళ్ల కిందట కూలింది. పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరైనా గుత్తేదారులు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఫలితంగా ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం