విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది.
జగన్ హయాంలో పింఛనుదార్లకు పాట్లు
ఉమ్మడి జిల్లాలో విశ్రాంత ఉద్యోగుల సంఖ్య : 15,300
ప్రతి నెలా పింఛను చెల్లింపులు రూ.60 కోట్లు (సుమారుగా)
కుక్కునూరు, న్యూస్టుడే: వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. జగన్ గద్దెనెక్కాక వారి కష్టాలు మొదలయ్యాయి. 10- 15 తేదీలు వస్తేగాని పింఛను అందడం లేదు. కరవుభత్యం ఒక్కసారే చెల్లించారు. క్వాంటమ్ పింఛనులో కోత, డీఏల తగ్గింపు వంటి చర్యలతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
2019 నుంచి.. 2019లో జగన్ పీఠం ఎక్కగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ కొంతకాలం ఇచ్చారు. తర్వాత పీఆర్సీ కమిషన్ నివేదికను పట్టించుకోకుండా 23 శాతం రివర్స్ పీఆర్సీ అమలు ఇస్తున్నారు. ఒకటో తేదీన పింఛను సొమ్ము అందుకున్నది ఈ అయిదేళ్లలో ఒక్కసారీ లేదు. 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబరు వరకూ 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. 2018 జులై నుంచి ఇప్పటివరకూ 185 నెలల కరవుభత్యం పెండింగులో ఉన్నాయి. 70 ఏళ్లలోపు పింఛనుదారులకు అదనపు భృతి గతంలో 10 శాతం ఉండగా.. దానిని 7కు కుదించారు. 75 ఏళ్లవారికి 15 శాతం ఉండగా.. 12కు తగ్గించారు. పింఛనుదారులు చనిపోతే వారికి చెల్లించాల్సిన మట్టిఖర్చులుపింఛను మంజూరు చేసే విధానాన్ని మార్పు చేసి రూ.25 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.
దీనస్థితిలో బాధితులు
విశ్రాంత ఉద్యోగులు కాలం చేస్తే.. ఆ కుటుంబానికి ఆ ఉద్యోగికి వచ్చే పింఛనుపై 60 శాతం మాత్రమే చెల్లిస్తారు. దీంతో వారికి నెలకు రూ.15-20 వేలకు మించిరావు. ప్రతి నెలా వీరికి పింఛన్లు ఆలస్యంగా అందుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.
గత ప్రభుత్వంలో..
రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంటుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పదో పీఆర్సీ ఇచ్చారు. జూన్ 2014 నుంచి మార్చి 2015 వరకు 10 నెలల పీఆర్సీ బకాయిలు ఒకేసారి పింఛనుదారులందరికీ చెల్లించారు. ఉద్యోగ విరమణ తేదీకి 15 రోజులు ముందుగానే ట్రెజరీలో బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యేక జీవో తెచ్చారు. ఉద్యోగ విరమణ రోజే పింఛను గ్రాట్యుటీ, కమ్యుటేషన్, గ్రూప్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంటు తదితరాలు ఉద్యోగులకు సకాలంలో అందించారు. ప్రతినెలా 31వ తేదీ లేదా ఒకటో తేదీన పింఛను ఇచ్చేవారు.
ఆరోగ్య కార్డులు చెల్లవు
ఆరోగ్య (ఈహెచ్ఎస్) కార్డులను నిర్వీర్యం చేశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళితే ఆ కార్డులతో నగదు రహిత సేవలు అందటం లేదు. అప్పు చేసి ఆ బిల్లులను రీయింబర్స్మెంట్ చేస్తే ఆ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఇక డీఏలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపి ఆదాయపు పన్ను వసూలు చేస్తుండటం గమనార్హం.
మొదటి తేదీ పింఛను అందుకుని చాలా కాలమైంది
పింఛను మొదటి తారీఖున అందుకొని చాలా కాలమైంది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. 2019 నుంచి పింఛనుదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. క్వాంటమ్ పింఛనులో కూడా కోత విధిస్తే.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవారు వైద్యఖర్చులు ఎలా భరిస్తారు. ఆరోగ్యకార్డులను ప్రైవేటు ఆసుపత్రులు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
గాదిరాజు వెంకటసూరపరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు
వాయిదాల పద్దతిలో డీఏల చెల్లింపు
కేంద్రప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులతో సమానంగా రాష్ట్రప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఆరునెలలకోసారి డీఏ ఇవ్వడంలేదు. వాయిదా పద్దతిలో చెల్లిస్తున్నారు. పీఆర్సీ ఏరియర్స్ 2020 నుంచి ఇవ్వటం లేదు. ఆరు డీఏలు రావాలి. పింఛను సొమ్ములపై ఆధారపడి ఈఎంఐలు చెల్లిస్తుంటాం.
టీవీ సుబ్బారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం