ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది.
నామపత్రాల్లో అభ్యర్థుల వెల్లడి
కూటమి, వైకాపా నుంచి ఒక్కొక్కటి దాఖలు
న్యూస్టుడే, ఏలూరు, అర్బన్, బుట్టాయగూడెం: ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. కార్యకర్తల ఉత్సాహం..నాయకుల్లో ఉత్కంఠ నడుమ నామపత్రాల స్వీకరణకు తొలి రోజైన గురువారం పలువురు నేతల నామపత్రాలు దాఖలు చేశారు. వాటితో పాటు వారి స్థిర, చరాస్తుల వివరాలు, క్రిమినల్ కేసుల వివరాలతో అఫిడవిట్లు సమర్పించారు. మొదటి రోజు దాఖలైన నామపత్రాలు పరిశీలిస్తే..ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా నుంచి ఒక్కొక్క నామపత్రం దాఖలైంది. ఏలూరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆళ్ల నాని, పోలవరం కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. వారు అఫిడవిట్లో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏలూరులో దాఖలు చేస్తున్న ఆళ్ల నాని
అభ్యర్థి పేరు: ఆళ్ల నాని
పార్టీ: వైకాపా
విద్యార్హతలు: ఇంటర్, బీకాం (మధ్యలో ఆపేశారు)
కేసులు: ఏమీ లేవు
చరాస్తుల విలువ మొత్తం: రూ.1,39,96,885.
భార్య పేరిట రూ.72,69,897
స్థిరాస్తి విలువ మొత్తం:రూ.55,60,650. భార్య పేరిట రూ.5,92,29,200
సొంత ఇంటి విలువ: రూ.2,00,22,000. భార్య పేరున రూ.6,20,54,000
బంగారం విలువ: రూ.4,55,000. భార్య పేరున రూ.47,25,000
అప్పులు: రూ.27,51,846. భార్య పేరున రూ.9,45,100
వాహనాలు: టయోటా కారు విలువ రూ.32,31,000.
వాల్వో కారు విలువ రూ.83,60,000. భార్య తరఫున మహేంద్రా స్కార్పియో విలువ రూ.16,81,301. ఇసుజు డీ-మ్యాక్స్ క్రూ విలువ రూ.8,71,047
కేఆర్పురంలో నామపత్రం అందిస్తున్న చిర్రి బాలరాజు
అభ్యర్థి: చిర్రి బాలరాజు, పార్టీ: జనసేన
విద్యార్హతలు: డిగ్రీ బీఏ, కేసులు: ఏమీ లేవు
చరాస్తుల విలువ: రూ.17,08,164
బంగారం: 72 గ్రాములు, స్థిరాస్తి విలువ:
రూ.34,93,500, బీ భార్యకు తాటియాకులగూడెంలో రూ.3.5 లక్షల విలువైన స్థలం, బర్రింకలపాడులో రూ.29,43,500 విలువైన ఉమ్మడి భూమి ఉంది. అప్పులు: రూ.3,15,500
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి