అయిదేళ్లూ గడ్డుకాలం
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది.
పరిశ్రమల రంగం కుదేలు
ఔత్సాహికులకు మొండిచేయి
ఏలూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మూతపడిన పరిశ్రమలు
జిల్లాలో 2014-2019 మధ్య కాలంలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలు 620 స్థాపించగా 2019-2024 కాలంలో 250 పరిశ్రమలే ఏర్పాటయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. ఈ సుదీర్ఘ కాలంలో ఉమ్మడి పశ్చిమలో ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదంటే నమ్మాల్సిందే. పోనీ ఉన్నవాటిని సజావుగా సాగనిచ్చారా.. అంటే అదీ లేదనే చెప్పాలి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులకూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడటంతో అయిదేళ్లలో ఏ ఒక్కటీ సాకారం కాలేదు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 425 భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఏలూరులో 73, భీమవరం 181, తణుకు 83, పాలకొల్లు 22, నూజివీడు 66 ఇలా కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణ యథాతథంగా ఉన్నా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు జిల్లాలో మనుగడ లేకుండాపోయింది. ఉన్న పరిశ్రమలనే మూసేలా పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని విద్యుత్తు బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఖాయిలాపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు మరో ప్రాంతానికి వలస వెళుతున్నారు.
అందని ప్రోత్సాహం.. విద్యుత్తు, స్థలం, ముడి సరకు ఇలా ప్రతీ దాంట్లోనూ రాయితీలు అందించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు లేవు. సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. అవగాహన సదస్సులతో చేతులు దులుపుకుంటున్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి సింగిల్ డెస్క్ విధానంలో కాలయాపన లేకుండా అనుమతులు ఇవ్వాలి. పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం 15 రోజుల్లో, బిల్డింగ్ ప్లాన్ 30, విద్యుత్తు కనెక్షన్ 7, కాలుష్య నియంత్రణ మండలి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనుమతి 30, అగ్నిమాపక శాఖ అనుమతి 15 రోజుల్లో ఇవ్వాల్సింది. కానీ ఆచరణలో అది జరగక కార్యాలయాల చుట్టూ ఔత్సాహికులు తిరిగితిరిగి విసిగివేసారిపోతున్నారు.
అనుమతులు రాక నిరుత్సాహం.. ఏలూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పీవీసీ పైపుల కర్మాగారం పెడదామనుకున్న ఒక యువకుడు అనుమతులు సకాలంలో రాక ఆ ఆలోచనను విరమించుకున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి రుణం సమకూర్చుకున్నారు. సింగిల్ విండో ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా సకాలంలో రాక నిరుత్సాహపడ్డారు. కర్మాగారం ఏర్పాటు చేయకుండానే వెనుదిరిగారు.
సరిగా లేదంటూ తిప్పారు.. ఒక యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త రూ.2 కోట్లతో ఫర్నిచర్ తయారీ పరిశ్రమ పెడదామని.. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులకు హాజరయ్యారు. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సమర్పించగా.. సరిగా లేదని అధికారులు వెనక్కు పంపారు. మళ్లీ తయారు చేయించి ఇవ్వగా.. అదీ సరిగా లేదన్నారు. విసుగు చెందిన ఆ యువకుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం