జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి.
అన్నదాతల ఎదురు చూపులు
సార్వాలో నేలపాలైన వరి (పాత చిత్రం)
ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.54 కోట్లు పైగా జమ కావాల్సి ఉంది. అసలే ఇచ్చేది అరకొర పరిహారం.. ఐదు నెలలు కిందట నష్టపోయారు. బటన్నొక్కినా తీవ్ర జాప్యమైంది, అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని అన్నదాతలు దిగులు చెందుతున్నారు.
ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, నరసాపురం గ్రామీణ, న్యూస్టుడే: ‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. గత ఏడాది మిగ్జాం తుపాను వస్తే ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. నెలా పది రోజులుగా అన్నదాతలు పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతికి ఇస్తానన్నారు.. గత ఏడాది సార్వా పంట చేతికందే దశలో తుపాను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. డెల్టాలో కొన్ని గ్రామాల్లో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. డిసెంబరులోనే క్షేత్రస్థాయిలో పంట నష్టాల జాబితా రూపొందించి, సంక్రాంతికి ముందే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతితోపాటు ఉగాది కూడా వచ్చి వెళ్లిపోయింది. పశ్చిమలో ప్రాథమికంగా 59,125 ఎకరాలుగా నిర్ణయించి, చివరికి 44,729 ఎకరాలకు కుదించారు. ఏలూరు జిల్లాలో ప్రాథమికంగా 85 వేల ఎకరాలుగా అంచనా వేసి, 36 వేల ఎకరాలకు తుది జాబితా సిద్ధం చేశారు.
అయిదెకరాల్లో పంట నష్టపోయా. రూ.34 వేలు పెట్టుబడి రాయితీ రావాలి. ఇంకా ఖాతాలో జమ కాలేదు. లక్షకు పైగా అప్పులు మిగిలాయి. వడ్డీలు పెరిగిపోతున్నాయి.
యర్రంశెట్టి శ్రీను, గొంది.
సార్వాలో మూడొంతుల పంట నేలపాలైంది. ప్రభుత్వం ఇప్పటికీ సాయం అందించలేదు. నాకు ఎకరానికి రూ. 20 వేలు నష్టం వచ్చింది.
అప్పారావు, పెనుమంట్ర.
ఏటా వేమవరం నక్కలకాలువ పక్క చేలకు ముంపు తప్పడం లేదు. మూడేళ్లుగా నష్టపోతున్నాం. దాళ్వాలో నీరందడం లేదు. నాకు సార్వా నష్ట పరిహారం ఇంకా రాలేదు.
ఎ.నాగయ్య, ఆచంట వేమవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం