ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు.
అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణాలు
మారుతీనగర్లోని అంతర్గత రహదారుల్లో కొన్ని ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్నికల నియమావళి అమలుకు కొద్దిరోజులు ముందు కొన్నిచోట్ల పనులు ప్రారంభించారు.
భీమవరం పట్టణం, న్యూస్టుడే: భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. గతంలో చేపట్టిన పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
- ఈ కాలనీలో 3.70 ఎకరాల విస్తీర్ణంలో పార్కు ఉంది. తెదేపా హయాంలో అప్పటి పాలకమండలి రక్షణ గోడ నిర్మాణం చేసింది. ఏపీ అర్బన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో పార్కు ఆధునీకీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఆ ఊసే మరిచారు.
- డ్రెయిన్లు, రహదారుల అభివృద్ధికి గతంలో రూ. 2.5 కోట్లు విడుదలయ్యాయి. వాటిని సద్వినియోగం చేయకపోవడంతో అభివృద్ధి నిలిచింది. కొత్తగా ప్రతిపాదనలు లేకపోవడంతో వర్షాకాలంలో రహదారులు కొన్ని నీట మునుగుతున్నాయి.
అసలే చెత్త.. ఆపై పొగ
గొల్లవానితిప్ప రోడ్డుపై కమ్మేసిన పొగ
భీమవరం పట్టణంలో సేకరించే చెత్త, వ్యర్థాలను యనమదుర్రు డ్రెయిన్ గట్లపై గుట్టలుగా పోసి తరచూ నిప్పు పెడుతున్నారు. వాటినుంచి వెలువడే పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వ్యర్థాలన్నీ క్రమంగా డ్రెయిన్లోకి చేరి పూడిక ఏర్పడుతోంది. జిల్లా కేంద్రమైన భీమవరానికి దూరంగా డంపింగ్యార్డును ఏర్పాటుచేసి ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఈనాడు, భీమవరం
ముంపుతో ఇబ్బందులు
దాదాపు 24 ఏళ్ల క్రితం ఈ కాలనీ ఏర్పడింది. ఇప్పటికీ గ్రామీణ ఛాయలే కనిపిస్తాయి. ఇటీవల భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పడటం, ఈ ప్రాంతంలో కలెక్టరేట్ కార్యాలయం ఉండటంతో రహదారులు రద్దీగా మారాయి. వర్షాకాలంలో ముంపు ఇబ్బందులు వెంటాడుతున్నాయి. శాశ్వత ప్రణాళికతో అభివృద్ధి జరగాలి.
జి.సుబ్బారావు, స్థానికుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్