కరవు భత్యానికీ కరవే
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయులను వంచించిన ప్రభుత్వం
ఒక్కొక్కరికీ రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు బాకీ
ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు: అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీతాలు ఎలాగూ సమయానికి రావడం లేదు. కనీసం ఆర్థిక బకాయిలనైనా విడుదల చేయాలని అనేక సార్లు రోడ్డెక్కి ఉద్యమాలకు దిగితే వారిపై ఉక్కుపాదం మోపారు.
ఉమ్మడి జిల్లాలో 3,160 పాఠశాలల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారి జీతభత్యాలను బట్టి ఒక్కొక్కరికి కనీసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు కరవుభత్యం సొమ్ములు రావాల్సి ఉంది. పీఆర్సీ సమయంలో పాత డీఏలను చెల్లించి జీతాలు పెరిగాయని మభ్యపెట్టిన ప్రభుత్వం అడుగడుగునా ఉపాధ్యాయులను ఏదో రూపంలో వంచిస్తూ వచ్చింది. గతంలో కరోనా సాకుతో రెండు డీఏలు మాఫీ చేశారు. ఆర్నెళ్లకోసారి జనవరి, జులైల్లో డీఏ చెల్లించాల్సి ఉన్నా ఆ ప్రకారం ఇవ్వడం లేదు. వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామన్నా అదీ అమలు కాలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాత బకాయిలను చెల్లించకుండా ఎన్నికల నేపథ్యంలో జనవరి 1, 2023న చెల్లించాల్సిన డీఏను ఈ ఏడాది మార్చి జీతం కలిపి విడుదల చేశారు. జులై 1, 2023 డీఏను ఈ ఏడాది ఆగస్టులో చెల్లిస్తామని జీవో విడుదల చేశారు. 2023 నుంచి డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తానన్నా ఇవ్వలేదు.
ఏనాడూ పట్టించుకోలేదు
- ఐ.రాజగోపాల్, ఏపీటీఎఫ్ మాజీ కార్యదర్శి, తణుకు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏనాడూ ఉపాధ్యాయులను పట్టించుకోలేదు. భావితరాలను తీర్చిదిద్దాల్సిన వారిని ఇతర విధులకు కేటాయించి వారిపై కక్షపూరితంగా వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎప్పుడూ సకాలంలో చెల్లించలేదు.
హామీలతో మభ్యపెట్టారు
భీమవరంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు(పాతచిత్రం)
అమలుకాని హామీలిచ్చి మభ్యపెట్టారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏలను చెల్లించాల్సి ఉన్నా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.కరవుభత్యాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించడం శోచనీయం. - విష్ణుమూర్తి, యూటీఎఫ్ నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం