రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది.
నిర్వహణ గాలికొదిలిన వైకాపా సర్కారు
కొత్త నిర్మాణాలపై తాత్సారం
తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన మినీ బజార్లకు గ్రహణం
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే, మొగల్తూరు
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. కొత్తవి నిర్మించక పోగా ఉన్నవాటి నిర్వహణ గాలికొదిలేయటంతో కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. చివరకు తెదేపా హయాంలో మొదలు పెట్టి తుది దశకు వచ్చిన నిర్మాణాలను అయిదేళ్లుగా పూర్తి చేయకుండా తాత్సారం చేసింది.
అధికారులు కళ్లు మూసుకున్నారా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు బజార్లలో నాణ్యత అరకొరగానే ఉంటోంది. ఉల్లి, క్యారెట్, టమాట, బంగాళాదుంప, చిక్కుడు, బీట్రూటు ఇలా ఏ కూరగాయలైనా నాసిరకంగానే ఉంటున్నాయి. ధరలు తగ్గినా బోర్డుల్లో మాత్రం తగ్గించకుండా మాయ చేస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాద రైతు బజార్లో మార్కెట్ ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.
నిధులు ఇస్తే ఒట్టు: ఉమ్మడి జిల్లాలో వైకాపా అధికారం చేపట్టాక రైతు బజార్లకు పైసా నిధులు కూడా ఇవ్వలేదు. తెదేపా నిర్మాణం చేపట్టిన రైతు బజార్లను మొదలు పెట్టేందుకు కూడా వైకాపా సర్కారుకు మనసు రాలేదు. కలిదిండిలో రూ.36 లక్షలతో నిర్మాణం 80 శాతం పూర్తయింది. తెదేపా చేపట్టిందన్న అక్కసుతో గాలికొదిలేశారు.
చిన్నపాటి వర్షానికే నీట మునిగి పోయే ఏలూరు పత్తేబాద రైతు బజారు ఇది. మెరక చేసేందుకు టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వైకాపా ప్రభుత్వంపై గుత్తేదార్లకు ఉన్న నమ్మకమిది.
అవస్థలు ఇవి
- నిత్యం వందలాది మంది వచ్చే ఏలూరులోని పత్తేబాద రైతు బజారుకు కనీస సౌకర్యాలు లేవు. స్థలం ఇరుకు. పార్కింగ్ సౌకర్యం లేక రహదారిపై వాహనాలునిలిపేస్తున్నారు.
- ఏ రైతు బజారులోనూ డిజిటల్ ధరల పట్టికలు వినియోగంలో లేవు. ఆర్వో ప్లాంట్లు పని చేయటం లేదు. మరుగుదొడ్ల ఊసే లేదు.
గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన మొగల్తూరులోని మినీ రైతుబజారుని వైకాపా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకుండా ఇలా వదిలేసింది.
తెదేపా ప్రారంభించిందని అక్కసా..
తెదేపా హయాంలో మండలానికొకటి చొప్పున ఉమ్మడి జిల్లాలో 33 మినీ రైతు బజార్లను నిర్మిస్తే.. వైకాపా ప్రభుత్వ అసమర్థతో వాటిలో ప్రస్తుతం ఎలాంటి విక్రయాలు జరగటం లేదు. తెదేపా ప్రారంభించిన వాటిని వినియోగంలోకి తీసుకురావటం ఎందుకు అని వీటిని నిరుపయోగంగా మిగిల్చింది.
ఉమ్మడి జిల్లాలోని తణుకు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం వంటి కీలక పట్టణాల్లో అసలు రైతు బజార్లే లేవంటే ఇంతకన్నా దైన్యం ఏముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు