నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ.
బూత్స్థాయిలో ఆరా తీస్తున్న నేతలు
ఈనాడు డివిజన్, భీమవరం: ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. ఓటుకు ఇచ్చిన నోటు లెక్కలు, వచ్చిన ఓట్ల లెక్కలు మాత్రం వారిలో కొంత అసంతృప్తిని మిగిల్చాయి. ఏ ప్రాంతంలో ఎవరు ఓటు వేసేందుకు రాలేదో అన్న లెక్కలను బూత్స్థాయి నుంచి ఆరా తీస్తున్నారు. బూత్స్థాయిలో కొన్ని చోట్ల 30 శాతం ఓట్లు తగ్గడంపై తర్జనభర్జన పడుతున్నారు. తగ్గిన ఓట్ల కోసం వారి వారి లెక్కల ప్రకారం ఒక్కో పార్టీకి సుమారు రూ.2 కోట్ల చొప్పున ఖర్చయ్యింది.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా ఉదయం ఆరున్నరకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అంతా ఉదయం 12 గంటల్లోపు పూర్తయిందనేది అన్ని రాజకీయ పక్షాల విశ్లేషణ. స్థానికులు మాత్రం తర్వాత వేద్దాంలేం అని ఊరుకున్నారు. వీరిలో మరీ ఆలస్యంగా బూత్కి వెళ్లిన వారంతా రాత్రి 12 గంటల వరకు నిలబడి ఓటేయాల్సి వచ్చింది. ఓపిక లేని కొంతమంది వెనుదిరిగారు. వారే బటన్ నొక్కనివారు కావచ్చని ప్రాథమికంగా బూత్కమిటీలు అంచనాకు వచ్చినట్లు సమాచారం.
డిమాండ్ చేసి తీసుకెెళ్లినా
ఓటుకు ఓ పార్టీ రూ.2 వేలు పంపిణీ చేయగా, డ్వాక్రా సభ్యులకు, ఉద్యోగులకు రూ.వెయ్యి నుంచి 2 వేలు అదనంగా చేతులు తడిపారు. నెలరోజుల పాటు బూత్ కమిటీల నిర్వహణకు రూ.20 వేల నుంచి రూ.30 వేల చొప్పున ఖర్చు చేశారు. ఈ లెక్కలన్నీ వేస్తే కోట్ల రూపాయలని తేలింది. అయితే ఇంకా 20 శాతం వరకు ఓట్ల నమోదు తగ్గడం వారిని అసంతృప్తికి గురిచేసింది. ముఖ్యంగా ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటూ ఆరా తీసి..వారి జాబితాల్లో చూసుకొని మరీ సొమ్ములిచ్చారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోని కొంతమంది ఓటర్లు మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ నాయకులను డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. పంపిణీ ఆలస్యమైతే ఆయా ప్రాంతాల్లో బూత్కమిటీల వారిని నిలదీశారు. కొందరైతే ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వానికి తిట్ల దండకం అందుకున్నారు. బాబోయ్ వీరితో పడలేమని మరుసటి రోజు తెల్లవారుజామున కూడా భీమవరంలో నగదు పంపిణీ చేశారు.
ఎందుకు తగ్గింది
ఓట్ల నమోదు తేల్చాక ఇదేం దారుణమంటూ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్నిచోట్ల ఏ వార్డుల్లో ఓటర్లు వేయలేదనే గణాంకాలను రహస్యంగా సేకరిస్తున్నారు. భీమవరంలో కొన్ని వార్డుల్లో 70 శాతమే నమోదైంది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన, తొలగించిన, పొరుగు బూత్లకు మళ్లిన వారు ఎవరెవరనే వివరాలను సైతం తెలుసుకుంటున్నారు. ఎందుకు ఓట్ల శాతం తగ్గిందంటూ అంచనాలు వేస్తున్నారు. అనుచరగణంతో సమాచార సేకరణలో కాస్త కటువుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన సొమ్ము రూ.కోట్లలో ఉంది. మరీ 30 శాతం పైగా ఓట్లు రాలేదంటే ఆ సొమ్ము లక్షల్లో ఉంటుంది. అదంతా బూడిదలో పోసిన పన్నీరే అన్న ఆగ్రహాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వార్డుల వారీ సమాచారాన్ని సేకరించి, ఎవరు ఓట్లు వేశారు, ఎవరు వేయలేదనే దానిపై ఆరా తీసేందుకు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె వైద్యం.. ఆయుష్ తీసేశారు!
[ 01-06-2024]
అల్లోపతి వైద్యంలో తగ్గని రుగ్మత ఆయుర్వేదంలో నయమవుతుందని గ్రామీణుల విశ్వాసం. ఏదైనా సుస్తీ చేస్తే హోమియో వైద్యం కోసం చూసే రోగులు నేటికీ ఎక్కువగానే ఉన్నారు. -
మనదాకా వస్తేగానీ కదలరా?
[ 01-06-2024]
ఉమ్మడి పశ్చిమలో తాగునీటి నిర్వహణలో అధికారుల వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. -
ప్రకటనలతో సరి.. వసతులేవి మరి!
[ 01-06-2024]
గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రచార ఆర్భాటంగా మిగిలిపోతున్నాయి. -
బయటకు రావడం సాహసమే
[ 01-06-2024]
పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు రోజంతా ఉక్కపోత కొనసాగడంతో పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. -
నిబంధనల అమలు తప్పనిసరి
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. -
ఉడికిపోతోంది!
[ 01-06-2024]
మే నెల మధ్యలో వర్షాలతో కొద్దిగా చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. రోహిణీ కార్తె తో భానుడు సెగలు కక్కుతున్నాడు. -
నృత్య అభ్యసన.. అద్భుత ప్రదర్శన
[ 01-06-2024]
కంప్యూటర్ కాలం నడుస్తున్నా.. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు కొందరు పెద్దలు. వీరి అభిమతాన్ని గౌరవిస్తూ దేశీయ నృత్యానికి తలమానికమైన భరతనాట్యం, కూచిపూడిపై యువత ఆసక్తి కనబరుస్తున్నారు. -
భూసారం తెలిసేదెలా?
[ 01-06-2024]
వ్యవసాయంలో మందులు, రసాయనాల వాడకం పెరిగిపోతుండటంతో రైతులకు ఆర్థిక భారంతో పాటు భూమి సారాన్ని కోల్పోతోంది. -
జైలులో మిత్రులు... చోరీల్లో సహచరులు!
[ 01-06-2024]
వారిద్దరూ వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తూ... అక్కడే మంచి మిత్రులయ్యారు. కారాగారం నుంచి విడుదల అయ్యాక... ఇద్దరూ కలిసి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేయడం ప్రారంభించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్
-
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్ బ్యాంక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ