ఆ సర్కిల్లో అంతే!
పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు..
జీతం తీసుకుంటారు.. విధులకు హాజరుకారు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు.. జీతాలు మాత్రం నెలనెలా తీసుకుంటారు. ఇందుకు వేతనంలో సగం ఇచ్చి మేనేజ్ చేస్తుంటారు. ఆ సొమ్ము కొంతమంది జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇంకేముంది వారు రాకపోయినా మస్తర్లు వేసి మొత్తం జీతం వచ్చేలా అక్కడి బాధ్యులు చక్రం తిప్పుతుంటారు. ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేట పారిశుద్ధ్య విభాగం 11వ సర్కిల్లో అవినీతి రాజ్యమేలుతోంది. అక్కడ మొత్తం 45 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా సుమారు 15 మంది కొంతకాలం నుంచి విధులకు హాజరుకావడం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైన వీరికి నెలకు రూ.20 వేలు వస్తుంది. వీరు విధులకు హాజరు కానందున రూ.10 వేలిస్తారు. మిగిలిన మొత్తం అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి సంబంధిత అధికారుల వరకు ఎవరి వాటాలు వారికి చేరిపోతుంటాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడని ఈ బాగోతం తెలిసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఫలితంగా పారిశుద్ద్యం పై ఆ ప్రభావం పడుతుంది.
పెరుగుతున్న పని భారం.. మరో వైపు సిబ్బందిపై పనిభారం పడుతోంది. 45 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా.. 15 మంది రాకపోవడంతో ఉన్న 30 మంది ఆ పని అంతా చేయాల్సి వస్తోంది. వీరు నిత్యం డ్రెయిన్లలో పూడిక తీయడం, చెత్త సేకరించడం, రహదారుల్ని ఊడ్చటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత ఉండటంతో పనులు సజావుగా సాగడం లేదు. ఆర్ఆర్పేటలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. డ్రెయిన్లలో మురుగు పారక దోమల బెడద వెంటాడుతోంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. ‘ఆ సర్కిల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది విధులకు రాకుండా జీతాలు తీసుకోవడం కుదరదు’ అని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల