logo

సోమేశ్వరునికి పంచామృతాభిషేకాలు

వైశాఖమాస ద్వాదశి సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

Published : 21 May 2024 03:20 IST

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: వైశాఖమాస ద్వాదశి సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సాయంత్రం స్వామికి బిల్వార్చన, అమ్మవార్లకు కుంకుమార్చనలను ప్రధానార్చకుడు సోంబాబు ఆధ్వర్యంలో పండితులు నిర్వహించారు.


వేంకన్నకు మల్లెల అర్చన

కాళ్ల, న్యూస్‌టుడే: కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరు కల్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం స్వామివారికి మల్లెలతో అర్చన, సహస్ర నామ పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను శేష వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఆలయ కళా వేదికపై అభినయ నాట్య అకాడమీ (కూచిపూడి) విద్యార్థినుల నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని