చాకిరీ చేసినా.. సొమ్ముల్లేవ్!
ఎన్నికల క్షేత్రంలో బూత్ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు.
బీఎల్వోలకు దక్కని గౌరవ వేతనం
భీమవరం అర్బన్, న్యూస్టుడే: ఎన్నికల క్షేత్రంలో బూత్ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు. బీఎల్వోలు మాత్రం ఏడాది పొడవునా వివిధ బాధ్యతలు మోస్తున్నా వారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదు. ఒక్కో బీఎల్వోకు నెలకు రూ.500 చొప్పున గౌరవ వేతనంగా ఎన్నికల సంఘం చెల్లించాలి. గతంలో మూడు నెలలకు ఓసారి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మూడేళ్లుగా ఈ సొమ్ము అందడం లేదు. అంటే ఒక్కొక్కరికి రూ.18 వేల చొప్పున బకాయిలు పేరుకుపోయాయి. కానీ ఉన్నతాధికారులు అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇలాంటి సమయంలోనూ బకాయిల చెల్లింపుపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1,463 మంది బీఎల్వోలు ఉన్నారు. మొత్తం 9,681 మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.
ఖర్చు బారెడు.. ఇచ్చేది మూరెడు
పోలింగ్ సమయంలో కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు వీఆర్వోలకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన సొమ్ము మాత్రం ఇవ్వలేదు. ఒక్కో కేంద్రానికి ముందస్తుగా రూ.5 వేలు మాత్రమే చెల్లించారు. షామియానాల ఏర్పాటు విద్యుత్తు, నీరు ఇతరత్రా సౌకర్యాలు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు టీ, అల్పాహారం, భోజనాలకు కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చయినట్లు సమాచారం. తాజాగా కేంద్రాల పరిధిలో ఎంత ఖర్చయిందో వివరాలు తెలపాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో క్షేత్రస్థాయి ఉద్యోగులు వివరాలతో నివేదికలు పంపించారు. అసలు ఈ సొమ్ము ఇస్తారో ఇవ్వరో.. ఇస్తే ఎంతిస్తారో అర్థం కావడం లేదని వీఆర్వోలు తలలు పట్టుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల